Jyoti Malhotra: హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు

పాక్‌కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్గోత్ర జాడలు హైదరాబాద్‌లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు.

New Update
Jyothi Malhotra

Jyothi Malhotra

భారత సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తూ గూఢచార్యం చేస్తున్న జ్యోతి మల్హోత్ర అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే హర్యానాకు చెందిన ఈమె జాడలు ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ అలాగే అప్పటి గవర్నర్‌ తమిళసై పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి ఉన్నారు. 

Also Read: మరో ఘోర అగ్నిప్రమాదం.. యజమాని సహా 8 మంది మృతి!

Youtuber Jyoti Malhotra In Hyderabad 2023

ఆ సమయంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేశారు. ఇటీవల గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఎవరినైనా కలిశారా ? అక్కడ ఇంకా ఏమైన వీడియోలు తీశారా ? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.   

Also Read: పాక్ గూఢచారి.. యూట్యూబర్ మల్వోత్రా గురించి ఈ 5 విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థలకు అందిస్తోందనే ఆరోపణపై హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్‌ఐ అధికారులను కలిసిన జ్యోతి.. ఆ తర్వాత షకీర్‌ , రాణా షాబాజ్‌ అనే వ్యక్తులను కలిసినట్లు సమాచారం. 

Also Read: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు భయంకరమైన​ క్యాన్సర్​

Also Read: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్...50,000 డాలర్ల బహుమతి

rtv-news | national-news | JYOTHI MALHOTRA | hyderabad | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు