Vaccine: దారుణం.. వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారికి ప్రాణాంతక వ్యాధి

కేరళలో ఓ ఏడేళ్ల చిన్నారికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రాణాంతకమైన రేబిస్‌ వైరస్ సోకింది. ఇటీవల ఆ చిన్నారికి కుక్క కరవడంతో వైద్యులు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయినప్పటికీ ఆమెకు వైరస్ సోకడం కలకలం రేపుతోంది.

New Update
Seven-year-old Kerala girl contracts rabies despite vaccination, admitted to hospital

Seven-year-old Kerala girl contracts rabies despite vaccination, admitted to hospital

సాధారణంగా ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు చాలామంది వ్యాక్సిన్లు తీసుకుంటారు. కానీ ఓ ఏడేళ్ల చిన్నారికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రాణాంతకమైన రేబిస్‌ వైరస్ సోకింది . కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమెకు తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి రేబిస్‌ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఆమెకు రేబిస్‌ వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. 

Also Read: లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో

Rabies Despite Vaccination

వ్యాక్సిన్  చివరి డోసు తీసుకోవడానికి ముందు ఈ రేబిస్ వ్యాధి నిర్ధారణ జరిగినట్లు పేర్కొన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నెల రోజుల క్రితం ఆ ఏడేళ్ల బాలికను తన ఇంటి ముందు ఓ కుక్క కరిచింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెను ముందుగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తాలూక ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయాలన్నీ శుభ్రం చేసి ఆ పాపకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు జ్వరం వచ్చింది. దీంతో ఆమెను తిరువ‌నంత‌పురంలోని అవిత్తమ్ తిరునల్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్

ఇదిలాఉండగా కొన్నిరోజుల క్రితం కేరళలోని మలప్పురం జిల్లాలో ఆరేళ్ల చిన్నారి కూడా రేబిస్‌ వ్యాధిలో మరణించింది. కుక్కలు దాడి చేసినప్పుడు ఒకవేళ వాటి దంతాలు రక్తనాళాలలకు దిగితే అప్పుడు రేబిస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉంటుందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. అందుకే కుక్కల జోలికి వెళ్లకూడదని.. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఈమధ్యకాలంలో చిన్నారులను కుక్కలు కరిచే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుక్క కరిచి పలువురు చిన్నారులు మృతి చెందిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 

Also Read: మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు ఉంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

Also Read: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

telugu-news | rtv-news | dog-bite | national news in Telugu | telugu crime news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు