BIG BREAKING: సరిహద్దుల్లో వార్ టెన్షన్.. యుద్ధానికి సై అంటున్న పాక్

సరిహద్దుల్లో భారత్‌తో పాక్ యుద్ధానికి సిద్ధమవుతోంది. పంజాబ్ బార్డర్‌కి 40 కి.మీ దూరంలో పాక్ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఆఖరికి యుద్ధ ట్యాంకులను కూడా బార్డర్‌కు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

New Update

పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మ‌ృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగినప్పటి నుంచి పాక్ కయ్యానికి కాలు దువ్వుతుంది. సరిహద్దుల్లో వరుసగా కాల్పులు జరపడంతో పాటు.. యుద్ధానికి సిద్ధమవుతోంది. బార్డర్‌లోకి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వార్ ట్యాంకులను తీసుకొస్తోంది. పాక్, పంజాబ్ బార్డర్‌కి 40 కి.మీ దూరంలో పాక్ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఆఖరికి యుద్ధ ట్యాంకులను కూడా బార్డర్‌కు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

యుద్దానికి సై అంటున్న పాక్..

ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతూనే ఉంది. నిన్న అర్థరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ కాల్పులకు పాల్పడినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ కాల్పులను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దులో పాక్ సైన్యం రోజూ కూడా దాడులకు పాల్పడుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు