/rtv/media/media_files/2025/06/07/JF4sjxQZFCjzXp9MTKkP.jpg)
IndiGo passenger loses Rs 2.65 lakh deal
ఓ వ్యక్తి ఇండిగో ఎయిర్పోర్ట్ సిబ్బంది తీరుపై మండిపడ్డాడు. వారివల్లే తాను ఒక పెద్ద డీల్ కోల్పోయానని.. దీని విలువ రూ.2.65 లక్షలు అని ఆవేదన చెందాడు. ఈ మేరకు లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. అతడి పోస్టు ప్రకారం..
క్షణాల్లో రూ.2.65 లక్షల డీల్ మిస్
అతడి పేరు చయాన్ గార్గ్. అతడు ఓ ముఖ్యమైన పనిమీద జైపూర్ నుంచి ముంబైకు వెళ్లాలనుకున్నాడు. దీంతో తెల్లవారుజామున 4:40 గం.లకు జైపూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అనంతరం బోర్డింగ్ ప్రారంభానికి ఇంకా 10-15 నిమిషాలు పడుతుందని ఇండిగో ఎగ్జిక్యూటివ్ చెప్పడంతో వాష్ రూమ్కు వెళ్లాడు.
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
అనంతరం 12 నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి బోర్డింగ్ గేటు మూసేశారు. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఆ సమయానికి ప్రారంభం కావాల్సిన బోర్డింగ్.. మూసివేయడంతో ఖంగుతిన్నాడు. వెంటనే వెళ్లి ఎయిర్పోర్ట్ స్టాఫ్ను అడిగాడు. ఎలాంటి ప్రకటన లేకుండా ఎలా మూసేస్తారు అంటూ ప్రశ్నించాడు. దానికి వారు స్పందిస్తూ.. జైపూర్ ఎయిర్పోర్టులో బహిరంగ ప్రకటన అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని తెలియజేశారు.
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
Chayan Garg, an IndiGo passenger, took to LinkedIn to allege mishandling by airline staff at Jaipur Airport that caused him to miss a critical flight to Mumbai. Citing silent airport policies and poor communication, Garg claimed a resulting business loss of ₹2.65 lakh. The post… pic.twitter.com/fEJBlLfEb8
— The Daily Jagran (@TheDailyJagran) June 6, 2025
ఆ తర్వాత అతడు ఫ్లైట్ సిబ్బందిని చాలా వేడుకున్నాడు. తాను వెళ్లవలసిన పని ఎంత ముఖ్యమో వారికి వివరించాడు. కానీ వారు బోర్డింగ్ క్లియర్ చేయలేదు. అంతేకాకుండా తన ప్రయాణానికి ప్రత్యమ్నాయం కూడా చూపలేదు. టికెట్ఫేర్ రిఫండ్ కూడా ఇవ్వలేదు. కనీసం తనపై సానుభూతి కూడా చూపించలేదు. దీని వల్ల అతడు క్లయింట్ను కోల్పోయాడు. దాని విలువ రూ.2.65 లక్షలు. నెల రోజుల శ్రమ క్షణాల్లో వృథా అయిందని చయాన్ గార్గ్ అనే ప్రయాణికుడు తన పోస్టు ద్వారా ఆవేదన చెందాడు. ఆ పోస్టును ‘ఇండిగో మీరు దిగజారుతున్నారు’ అనే క్యాప్షన్తో పోస్టు చేశాడు.
అది వైరల్గా మారడంతో ఇండిగో సంస్థ రియాక్ట్ అయింది. తాము ప్రామాణిక విధానాలను అనుసరించామని పేర్కొంది. మిస్టర్ గార్గ్ ఫ్లైట్ మిస్ కావడం ఎంత నిరాశ కలిగిస్తుందో తమకు తెలుసు అని తెలిపింది. తమ సమీక్ష ప్రకారం.. బయల్దేరడానికి 25 నిమిషాల ముందు బోర్డింగ్ గేట్ క్లోజ్ చేశారని వివరించింది. ఆ తర్వాత మీరు వచ్చారని.. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొంది. తరువాత ఫ్లైట్ కోసం ఎయిర్పోర్టు సిబ్బంది మిమ్మల్ని సూచించినా.. మీరు అందులో ప్రయాణించకూడదనే మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపింది.
viral-news | indigo-airlines | flight indigo | latest-telugu-news | telugu-news | telugu viral news | national news in Telugu | today-news-in-telugu