Crime News: జర్రయితే చచ్చిపోతుంటిరా... నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా ..శోభనం గదిలో భర్తకు భార్య వార్నింగ్‌

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ కు సితార అనే యువతితో వివాహం జరిగింది. మొదటిరాత్రి సితార చేతిలో కత్తితో దర్శన మిచ్చింది. వరసకు మేనల్లుడైన అమన్ ను ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది.

New Update
Wife warns husband in Shobhana's room

Wife warns husband in Shobhanam room

Crime News: ఒకరిని ప్రేమించడం..పెద్దల బలవంతంతో మరోకరిని పెళ్లిచేసుకోవడం..పెళ్లి తర్వాత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం నేటి సమాజంలో సర్వసాధారణమై పోయింది. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులే ఎక్కువయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడికి ఇలాంటి ఘటనే ఎదురైంది. కాకపోతే భర్తలను చంపుతున్న భార్యల స్టోరీలు చూసి ఉండటంతో ముందు జాగ్రత్త పడి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. 

Axiom Mission: ఆక్సియం-4 మిషన్‌లో నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా


వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే యువకుడికి, సితార అనే యువతితో ఇటీవల వివాహం జరిగింది,  పెళ్లి సమయంలో అంతా బాగానే జరిగినప్పటికీ శోభనం రోజు రాత్రి అనుకోని సంఘటన ఎదురైంది. మొదటి రాత్రి పాల గ్లాసుతో రావలసిని సితార చేతిలో కత్తితో దర్శన మిచ్చింది. చేతిలో కత్తిని చూసి జడుసుకున్న నిషాద్‌ ఒక మూలకు నక్కి కూర్చున్నాడు. అప్పుడే తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పింది సితార. వరసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని పేర్కొ్న్నాడు నిషాద్‌.

Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం

అంతేకాదు సితార ప్రేమికుడైన అమన్ కూడా తనకు మెసేజ్ చేసి స్నేహితులతో కలిసి వచ్చి చంపేస్తానని బెదిరించాడని వాపోయాడు నిషాద్‌. ఇదిలా ఉండగానే ఒక రోజు కేదార్ నాథ్‌ యాత్రకు తీసుకువెళ్లమని తనను కోరిందన్న నిషాద్‌.. రాజరఘువంశి ఘటన గుర్తుకువచ్చి ఆగిపోయానని నిషాద్‌ వెల్లడించాడు. మూడు రోజులు తన ఇంట్లో ఉండి, ఒకరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో పారిపోయిందని తెలిపాడు నిషాద్‌. మూడు రోజులు తనతో ఉన్నప్పుడు ఎక్కడ చంపేస్తుందో అని నిద్ర కూడా పోలేదని, పెళ్లి అనే మాట వింటేనే గుండెల్లో దడ పుడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు నిషాద్‌.

Also Read: వందేభారత్‌ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే

కాగా సితార ముందుగా చెప్పినట్లే ఒకరోజు గోడదూకి తన ప్రేమికుడితో వెళ్లిపోయింది. అలా వెళుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇష్టం లేని పెళ్లిచేసుకుని ఇలా భర్తలను చంపడం దేనికని, వారికి ఇష్టమైన వారితోనే వెళ్లిపోవచ్చు కదా అని నిషాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ మూడు రాత్రులు తనకు మూడు యుగాలుగా గడిచాయని. ఆమె చేతిలో ఎక్కడ ప్రాణాలు పోతాయోనని భయంతో బతికానని నిషాద్‌ ఊపిరిపీల్చుకుంటూ చెప్పాడు.

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

Advertisment
Advertisment
తాజా కథనాలు