/rtv/media/media_files/2025/07/23/government-official-blackmails-wife-by-filming-videos-in-bathroom-2025-07-23-10-38-30.jpg)
Government official blackmails wife by filming videos in bathroom
పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై గూఢచర్యం, బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అతను తన భార్యపై రహస్యంగా నిఘా పెట్టాడని, ఆమె స్నానం చేస్తున్న సమయంలో వీడియోలను రికార్డ్ చేశాడని ఆరోపించింది.అప్పులు, కారు EMI చెల్లించడానికి ఆమె తల్లిదండ్రుల నుండి డబ్బు తీసుకురాకపోతే తీసిన వీడియోలను ఆన్లైన్లో లీక్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Government Official Blackmails Wife
తన భర్త లాగే నగరంలో క్లాస్ I ప్రభుత్వ అధికారిణి అయిన ఆ మహిళ, భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు ఏడుగురుపై బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపులు, వ్యక్తిగత గోప్యతకు భగ్నం కలిగించడం వంటి నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2020లో వివాహం చేసుకున్న ఈ జంట కొంతకాలం భాగానే ఉన్నారు. కాలక్రమేణా, భర్తకు తన భార్య ప్రవర్తనపై అనుమానం పెరిగింది. దీంతో ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు.
అంతేకాక ఆమెపై నిఘా పెట్టడానికి, ఆమె కార్యకలాపాలను రహస్యంగా పర్యవేక్షించడానికి, అతను బాత్రూమ్తో సహా ఇంటి ఆవరణలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశాడు. అతను విధుల్లో ఉన్న సమయంలో కూడా ఆమెను ట్రాక్ చేసేవాడని తెలిసింది. కారు, ఇంటి అప్పులు చెల్లించడానికి తన భార్య తల్లిదండ్రుల నుండి రూ.1.5 లక్షలు తీసుకురాకపోతే ఆమెకు సంబంధించిన స్నానపు వీడియోలను ఇంటర్నెట్లో విడుదల చేస్తానని పదే పదే బెదిరించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
Also Read : జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?
వివాహం అయినప్పటి నుండి, తన భర్త తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, ఇతరులతో సహా తన అత్తమామలు తనను నిరంతరం వేధించారని, తన తల్లిదండ్రుల ఇంటి నుండి డబ్బు, కారు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొంది. పోలీసులు భర్త, అతని ఏడుగురు బంధువులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద బ్లాక్మెయిల్, గృహ హింస, దోపిడీ, గోప్యత ఉల్లంఘన అభియోగాలతో సహా కేసు నమోదు చేశారు.
పోలీసులు ఇంటిలో ఏర్పాటు చేసిన నిఘా పరికరాలను విశ్లేషిస్తున్నారు. మరిన్ని ఆధారాలను సేకరించడానికి ఇంటి నుండి ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు, మహిళ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తమ దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
Also Read : ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్ బ్యాచ్
bathroom-phone | bathroom | husband | wife | black mail | Govt Employee | pune | crime news