/rtv/media/media_files/2025/06/23/aap-2025-06-23-17-56-56.jpg)
AAP
ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్లోని కడి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. విసావాదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా గెలిచారు. ఆయన బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్పై 17 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
#Gujarat Bypolls Result :
— All India Radio News (@airnewsalerts) June 23, 2025
BJP wins the Kadi constituency seat, and AAP candidate wins the Visavadar constituency seat. pic.twitter.com/5paLxVCabG
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
పంజాబ్లోని లుధియానా వెస్ట్ స్థానంలో కూడా ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందిన ఆప్.. ఉపఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచింది. దీంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నిరాశలో ఉన్న ఈ పార్టీకి ఈ గెలుపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక కేరళలో నిలంబుర్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ శౌకత్ గెలుపొందారు.పశ్చిమ బెంగాల్లోని కాలిగంజ్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ విజయం సాధించారు.
Also Read: ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
#Bypolls2025 ||
— All India Radio News (@airnewsalerts) June 23, 2025
Punjab: Aam Aadmi Party (AAP) candidate Sanjeev Arora has won the Ludhiana West Assembly bypoll by a margin of 10,637 votes from his close rival, Congress nominee Bharat Bhushan Ashu.
The Ludhiana West seat became vacant following the death of AAP MLA Gurpreet… pic.twitter.com/6Ggazu5w7r
#Bypolls2025 ||
— All India Radio News (@airnewsalerts) June 23, 2025
Trinamool Congress candidate Alifa Ahmed won the Kaliganj assembly by-election in West Bengal.
She defeated her nearest rival BJP's Ashish Ghosh, by 50,049 votes.#ByeElectionResults pic.twitter.com/Bxn0aCfVb6
మొత్తానికి దేశవ్యాప్తంగా ఐదు స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. ఇదిలాఉండగా.. గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్లలో ఒక్కో చోట ప్రస్తుత ఎమ్మెల్యేలు మరణించడం వల్ల ఉప ఎన్నికలు జరగగా.. కేరళ, గుజరాత్లలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఐదు చోట్ల ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక