By Elections: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్‌ ప్రభంజనం.. షాక్‌లో బీజేపీ

ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీ 1, ఆప్ 2, కాంగ్రెస్ 1, టీఎంసీ 1 స్థానాల్లో గెలిచాయి.

New Update
AAP

AAP

ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లోని కడి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. విసావాదర్‌ స్థానంలో ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా గెలిచారు. ఆయన బీజేపీ అభ్యర్థి కిరీట్‌ పటేల్‌పై 17 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 

Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!

Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్‌ సంచలన హెచ్చరిక

పంజాబ్‌లోని లుధియానా వెస్ట్‌ స్థానంలో కూడా ఆప్‌ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందిన ఆప్‌.. ఉపఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచింది. దీంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నిరాశలో ఉన్న ఈ పార్టీకి ఈ గెలుపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక కేరళలో నిలంబుర్‌ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్యదాన్ శౌకత్ గెలుపొందారు.పశ్చిమ బెంగాల్‌లోని కాలిగంజ్‌ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ విజయం సాధించారు.

Also Read: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్‌ సెటైరికల్ ట్వీట్‌

మొత్తానికి దేశవ్యాప్తంగా ఐదు స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. ఇదిలాఉండగా.. గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ఒక్కో చోట ప్రస్తుత ఎమ్మెల్యేలు మరణించడం వల్ల ఉప ఎన్నికలు జరగగా.. కేరళ, గుజరాత్‌లలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఐదు చోట్ల ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్‌ సంచలన హెచ్చరిక

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు