/rtv/media/media_files/2025/06/23/marriage-cheating-2025-06-23-17-28-19.jpg)
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిత్యపెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. పెళ్లి పేరుతో ఒకరి తరవాత ఒకరిని ఇలా ఏకంగా 12 మంది పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసింది. ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేస్తుంది. ఇందుకోసం ఫ్యామిలీ అంతా ముఠాగా ఏర్పడింది. రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి దుర్గానీలిమ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లితో పాటుగా మరో ఇద్దరు నిందింతులతో కలిసి దుర్గానీలిమ మోసాలకు పాల్పడుతోంది.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
విడాకులు తీసుకున్న పురుషులనే
ఆస్తిపాస్తులు, విడాకులు తీసుకున్న పురుషులనే టార్గెట్ చేస్తూ వారికి మాయమాటలు చెబుతూ పెళ్లి చేసుకుంటూ మోసాలకు పాల్పడుతోంది. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న అమాయకులకు వల వేసి మాయ మాటలు చెప్పి పెళ్లికి ఒప్పించి డబ్బుతో పరారయ్యేది. ఇలా పలు జిల్లాల నుంచి 12 మందిని మోసం చేసి లక్షల్లో దోచుకుంది. ఎవరైనా ఎదురుతిరిగితే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు దిగుతుంది ముఠా.
Also Read: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్లో బీజేపీ
ఎట్టకేలకు వీరిపై కేసు నమోదు కావడంతో బాధితులు బయటకువస్తున్నారు. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు.. తమకు జరిగిన అన్యాయాన్ని.. ఎలా మోస పోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు. వారి ఫిర్యాదు మేరకు దుర్గానీలిమతో పాటుగా ఆమె తల్లి వీరలక్ష్మి మరో ఇద్దరు రామకృష్ణ, కల్యాణ్ లపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: నాకు దక్కనిది.. మరెవ్వరికి దక్కకూడదు.. యూపీలో ప్రేమోన్మాది ఘాతుకం
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక