Iran: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్‌ సంచలన హెచ్చరిక

ఇరాన్‌పై అమెరికా దాడులను ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్‌ తీవ్రంగా ఖండించింది. తమ సైనిక దళాలు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలపై విస్తృత దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని హెచ్చరించింది.

New Update
Iran's stark warning to Trump after US attack, ‘We will end this war’

Iran's stark warning to Trump after US attack, ‘We will end this war’

ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులను తాజాగా ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. యుద్ధం ప్రారంభించింది అమెరికానే అయినప్పటికీ.. మేము ముగింపు పలుకుతామంటూ తేల్చిచెప్పింది. తమ అణుకేంద్రాలపై దాడులు చేసినందుకు గాను ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. 

Also Read: కేరళ మాజీ సీఎంకు గుండెపోటు..ఆస్పత్రికి తరలింపు!

అంతేకాదు తమ సైనిక దళాలు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలపై విస్తృత దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొంది. ఇరాన్‌ గగనతల రూల్స్‌ను బ్రేక్‌ చేసి అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాజిద్‌ తఖ్త్‌రావంచి సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులు చేసినప్పటికీ కూడా యురేనియం అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంలో తాము నిరుత్సాహపడకుండా యూరేనియం అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు.  

Also Read: ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా?: అసలు నోబెల్ రావడానికి రూల్స్ ఏంటో తెలుసా?

ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ కూడా అమెరికా దాడులను ఖండించారు. ఈ దాడులకు ఫలితాన్ని అనుభవిస్తారంటూ హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు సిద్ధమవుతోందని ఇరాన్ మీడియా కూడా వెల్లడించింది. ఇదిలాఉండగా సోమవారం ఉదయం ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్‌ టెహ్రాన్‌లోని కెర్మాన్‌షా ప్రాంతంలో ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌ కూడా టెల్‌ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగుతోంది. 

Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్‌ సంచలన హెచ్చరిక

Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు