/rtv/media/media_files/2025/08/14/operation-sindoor-2025-08-14-15-05-43.jpg)
సాతంత్య్ర దినోత్సవం(Independense Day) సందర్భంగా 'ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor) లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 16 మంది BSF సిబ్బందికి శౌర్య పతకాలు లభించాయి. దేశ సరిహద్దులను రక్షిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల పరాక్రమానికి, అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7 నుంచి 10 వరకు భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్'ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో BSF దళాలు కీలక పాత్ర పోషించాయి.
Also Read : శునకాల బెడదకు వాళ్లే కారణం.. వీధి కుక్కల కేసుపై స్టే విధించిన సుప్రీంకోర్టు!
BSF JawansAwarded Gallantry Medals
Gallantry Medals for Seema Praharis
— BSF (@BSF_India) August 14, 2025
This Independence Day, 16 Brave Seema Praharis are being awarded Gallantry Medals for their conspicuous bravery & unmatched valour, for being resolute & steadfast during the Ops Sindoor.
The medals are a testament to the Nation's faith &… pic.twitter.com/wlENoJ3VF8
పాకిస్థాన్ బలగాలు, ముఖ్యంగా జమ్మూలోని ఖార్ఖోలా సరిహద్దు పోస్టు వద్ద భారత దళాలపై మోర్టార్ షెల్స్, మెషిన్ గన్లతో తీవ్రంగా దాడి చేశాయి. అయితే, బీఎస్ఎఫ్ సిబ్బంది ధైర్యంగా ఎదురొడ్డి, శత్రువుల డ్రోన్లను కూల్చివేశారు, వారి పోస్టులను, నిఘా పరికరాలను ధ్వంసం చేశారు. ఈ పోరాటంలో అసిస్టెంట్ కమాండెంట్ అభిషేక్ శ్రీవాస్తవ్, హెడ్ కానిస్టేబుల్ బ్రిజ్ మోహన్ సింగ్, కానిస్టేబుళ్లు భూపేంద్ర బాజ్పాయ్, రాజన్ కుమార్, బసవరాజా శివప్ప సుంకడ, దీపేశ్వర్ బర్మన్ వంటి సిబ్బంది ప్రత్యక్ష శత్రుదాడిలోనూ అసాధారణ ధైర్యం చూపారు.
మరో సందర్భంలో, జబోవాల్ సరిహద్దు పోస్టు వద్ద పాక్ బలగాల దాడిని అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఉదయ్ వీర్ సింగ్ సమర్థంగా ఎదుర్కొన్నారు. శత్రువుల మెషిన్ గన్ ఫైరింగ్లో గాయపడినప్పటికీ, ఆయన వెనక్కి తగ్గకుండా పోరాడి, శత్రువుల నిఘా కెమెరాను ధ్వంసం చేసి వారి HMG స్థావరాన్ని నిర్వీర్యం చేశారు. ఆయన చర్యలు తోటి జవాన్లలో స్ఫూర్తి నింపాయి.
అదే విధంగా, కరోటానా ఖుర్ద్, కరోటానా ఫార్వర్డ్, సుచేతగఢ్ సరిహద్దు పోస్టుల వద్ద మోర్టార్ మరియు మెషిన్ గన్ ఫైరింగ్ మధ్య, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ రాజప్ప బీ.టీ. మరియు కానిస్టేబుల్ మనోహర్ క్సాల్క్సోలు ముందువరుసలోని సైనికులకు మందుగుండు సామగ్రిని అందించారు. ఈ ప్రయత్నంలో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ రాజప్ప ప్రాణాంతక గాయాలు పాలయ్యారు.
అసిస్టెంట్ కమాండెంట్ అలోక్ నేగి మఖ్యారిలో తన దళాలను సమర్థంగా నడిపించి, 48 గంటలకు పైగా శత్రువులపై ప్రహారం కొనసాగించారు. ఈ శౌర్య పతకాలు దేశం యొక్క 'మొదటి రక్షణ శ్రేణి'గా బీఎస్ఎఫ్ పట్ల ఉన్న విశ్వాసాన్ని, గౌరవాన్ని చాటిచెబుతున్నాయి. ఈ వీరుల సాహసాలు దేశ రక్షణకు వారు చేసిన నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలుస్తాయి.
Also Read : జూబ్లీహిల్స్ బరిలో చిరంజీవి, నాగార్జున.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..!?