/rtv/media/media_files/2025/05/03/ZJl4IP18PMyDHfLAaEVU.jpg)
treasure
treasure : కొంతమందికి అప్పుడప్పుడు అదృష్టం అనుకోకుండా తలుపుతడుతుంది. అలాంటిదే చెక్ రిపబ్లిక్ కు చెందిన ఇద్దరూ సరదాగా హైకింగ్ కు వెళ్తే కోట్ల నిధి దొరికింది. ఈశాన్య పోడ్కర్కోనోసి పర్వతాలకు సరదాగా గడిపేందుకు వెళ్లిన వారికి 1808 కాలం నాటి నిధి దొరికింది. ఇద్దరు పర్యాటకులు గత ఫిబ్రవరి నెలలో చెక్ రిపబ్లిక్లోని పోడ్కర్కోనోసి పర్వతాలకు హైకింగ్కు వెళ్లారు. అలా వెళ్లినవారికి అదృష్టం కాళ్లకిందకు వచ్చింది. దట్టమైన అడవి ప్రాంతంలో వారు నడుస్తుండగా వాళ్ల కాళ్లకు ఏవో వస్తువులు తగిలాయి. ఏంటా అని చూస్తే బంగారు నగలతో కూడిన నిధి అని తేలింది. ఆ నిధి మొత్తం 7 కిలోల వరకు ఉంటుందని తెలిసింది. అంతా మొత్తాన్ని చూసిన వారు మొదట ఆశ్చర్యపోయారు.
Also Read: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్
Found On Unexpected Treasure
అందులో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు ఉన్నాయి. అంత మొత్తాన్ని అక్కడ చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు.తర్వాత దాన్ని తీసుకెళ్లి ఈస్ట్ బొహెమియన్ మ్యూజియానికి ఇచ్చారు.కాగా ఇది ఫిబ్రవరి నెలలో జరిగినప్పటికీ సదరు మ్యూజియం తాజాగా విషయాన్ని వెల్లడించింది.స్వాధీనం చేసుకున్న నాణేలు 1808 కాలం నాటివిగా గుర్తించినట్లు తెలిపింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్ సామ్రాజ్య కాలం నాటి ఆ నాణేలు 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.కరెన్సీపై ఉన్న చిన్న గుర్తులు 1918 నుండి 1992 వరకు యుగోస్లేవియాలో ఉపయోగం కోసం దీనిని ముద్రించారని సూచిస్తున్నాయి.
Also Read: మోదీజీ సూసైడ్ బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్లి అందరినీ చంపుతా : ముస్లిం మంత్రి
వంద సంవత్సరాల క్రితమే వాటిని భూమిలో దాచి పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఆ నిధిని నల్లటి వస్త్రంలో చుట్టి ఉంచడం గుర్తించారు. దాదాపు మూడు అడుగుల దూరంలో వారికి 16 పొగాకు సంచులు, 10 బ్రాస్లెట్లు, సన్నని వైర్ మెష్ తో తయారు చేసిన సంచి, ఒక దువ్వెన, ఒక కీ చైన్ కూడా దొరికాయి. ఆ వస్తువులు పసుపు లోహంతో తయారు చేయబడ్డాయని, అవి ఒక లోహపు పెట్టెలో దొరికాయని మ్యూజియం తెలిపింది.
మ్యూజియం పురావస్తు శాఖ మిరోస్లావ్ నోవాక్ మాట్లాడుతూ, ఇవి చాలా ప్రత్యేకమైనవని, అయితే భూగర్భంలో నిధిని పూడ్చడం చరిత్రపూర్వ కాలం నుండి సాధారణం అని అన్నారు. తరచుగా అలా నిధిని పాతిపెట్టేవారని, తరువాత వాటిని తిరిగి తీసుకోవచ్చనే ఉద్దేశ్యంతో అలా చేసే వారని తెలిపారు.నిపుణులు ఇంకా ఇతర వస్తువుల మూలాన్ని గుర్తించలేదు. వస్తువులను విశ్లేషించి, ఇవి ఏ లోహంతో తయారయ్యాయో గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది
Also Read: గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు మరో షాకిచ్చిన మోదీ!
మ్యూజియం పురావస్తు శాఖ మిరోస్లావ్ నోవాక్ మాట్లాడుతూ హైకర్స్ ఆ సంపదను చూపించినప్పుడు.. నేను ఎంతో ఆశ్చర్యపోయా. వీటిని ఇంకా విశ్లేషించాల్సి ఉంది. అయితే ఆ విలువైన లోహాల ప్రారంభ విలువే రూ.2.87 కోట్లు (340,000 డాలర్లు)గా ఉండొచ్చు. భూమిలో విలువైన వస్తువులను నిధుల రూపంలో నిల్వ చేయడం ప్రీహిస్టారిక్ సమయంలో ఒక ఆచారంగా ఉండేది. అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో దానిని భూమిలో దాచి, తర్వాత వచ్చి దానిని తీసుకుందామనుకునే ఉద్దేశమూ ఈ నిధి వెనక కారణం కావొచ్చు.అని మ్యూజియం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీలు ఈ నిధిని దాచి ఉండొచ్చన్న వాదనా ప్రచారంలో ఉంది. అయితే చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం.. ఆ నిధిలో పది శాతం హైకర్స్ కు దక్కొచ్చని మీడియా కథనాల్లో వెల్లడించారు.నిపుణులు ఇంకా ఇతర వస్తువుల మూలాన్ని గుర్తించలేదు. వస్తువులను విశ్లేషించి, ఇవి ఏ లోహంతో తయారయ్యాయో గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: నేతలకూ తప్పని టార్చర్..బీజేపీ మహిళా మంత్రికి అసభ్యకరమైన కాల్స్, మెసేజెస్
hidden-treasure | gold | currency-notes | international news in telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu