శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయం.. హైకోర్టు దర్యాప్తుకి ఆదేశం
శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాల నుంచి దాదాపు 4.54 కిలోల బంగారం మాయమైన వ్యవహారంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఆలయ పవిత్రతను, పారదర్శకతను దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.