/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి వసూలు చేయనున్న టారిఫ్ లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.దేశానికి ఈ సొమ్ము లభిస్తే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్ను అవసరం ఇక ఉండబోదని అభిప్రాయపడ్డారు. తాజాగా ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 1870-1913 మధ్యలో అమెరికాలో ఇన్ కమ్ ట్యాక్స్ లేదని..టారిఫ్ లే ప్రభుత్వ ప్రధాన ఆదాయవనరని వెల్లడించారు.
Also Read: Telangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. !
ఆ సమయంలో అమెరికా అత్యంత సంపన్న దేశంగా వర్థిల్లిందన్నారు. 1880 ల్లో మిగులు నిధులు ఖర్చు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటుచేశారన్నారు. కానీ...1913లో ఆదాయపు పన్ను వచ్చాక పరిస్థితులు మారాయని చెప్పారు.
Trump-Tariffs
టారిఫ్ ల నుంచి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అది ఆదాయపు పన్నును భర్తీ చేస్తుంది.ప్రస్తుతం విధిస్తున్న పన్నులతో రోజుకు రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుంది. గతంలో ఎన్నడూ ఇంత మొత్తం రాలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు..వ్యాపారాలు దెబ్బతినకుండా తాత్కాలికంగా సుంకాలకు విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను విధిస్తున్న సుంకాలను గ్రేట్ డిప్రెషన్ సమయంతో పోల్చడాన్ని ట్రంప్ కొట్టి పారేశారు.సుంకాల అమలుకు ముందే ఆ పరిస్థితి నెలకొందన్నారు. అమెరికా క్రిమినల్ జస్టిస్ లో మార్పుల అంశం పై ట్రంప్ స్పందిస్తూ..ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నయిబ్ అనుసరిస్తున్న భద్రతా చర్యలను అభినందిచారు. భారీ జైళ్లను నిర్మించడాన్ని మెచ్చుకొన్నారు.
అంతేకాదు..బైడెన్ సమయంలో దేశంలోకి అనుమతించిన నేరగాళ్లను వాటిలోకి పంపిస్తామన్నారు.
america | trump | donald trump tariffs | trump tariffs | trump tariffs news | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates