USA: స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు...ఇవాల్టి నుంచే అమలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో మరోసారి షాక్ ఇచ్చారు. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలను పెంచుతూ సంతకం చేశారు. ఇవి ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో మరోసారి షాక్ ఇచ్చారు. స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలను పెంచుతూ సంతకం చేశారు. ఇవి ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది.
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు పట్టువిడవటం లేదు. ఒక కోర్టు కాకపోతే మరోటి అంటున్నారు. నిన్న సుంకాలను నిలిపేయాలని యూఎస్ ట్రేడ్ కోర్ట్ ఆదేశాలిస్తే.. ఈ రోజు మరో కోర్టు దగ్గర నుంచి అనుమతిని తెచ్చుకున్నారు.
ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.
ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తో సహా అన్ని దేశాలపైనా సుంకాలు విధించారు. వాటిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరుతోంది. దీనిపై జూలై 8లోగా ఒక మధ్యంతర ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయి. అమెరికా చైనా వస్తువులపై 90 రోజుల పాటు 145% నుంచి 30%కి సుంకాలను తగ్గిస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చైనా కూడా అమెరికా దిగుమతులపై తన సుంకాలను 125% నుండి 10%కి తగ్గించనుంది.
అమెరికా, చైనా టారిఫ్ల వార్లో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. టారిఫ్ల అంశంపై చర్యలు జరిపేందుకు అమెరికా ముందుకొచ్చింది. చైనా అధికారులను అమెరికా అధికారుల బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని బీజింగ్కు చెందిన ఓ మీడియా తెలిపింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిన్న ఇండియా వచ్చారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరివురూ సుంకాలు, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ వంటి అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఎక్కువగా టారీఫ్ లపైనే మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు.
చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా దీని గురించి బీజింగ్ తీవ్రంగా స్పందించింది.తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.
వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి తొందరపాటు లేదని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రతీ దేశాన్ని కూడా కలవాలని, ముఖ్యంగా చైనాతో సఖ్యతతో ఉండాలని అనుకున్నట్లు తెలిపారు. అలాగే మెక్సికో, జపాన్, ఇటలీ దేశాలతో కూడా స్నేహం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.