Iran-Israel: రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు

ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి. 

author-image
By Manogna alamuru
New Update
iran

Iran Attacks On israel

ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ దీనిని ఇరాన్ కొట్టివేసింది. తామెలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తేల్చి చెప్పింది. అన్నట్టుగానే అటు యూఎస్ ఆర్మీ బేస్ ల మీదనా, ఇటు ఇజ్రాయెల్ మీదనా దాడులకు చేస్తోంది. రెండు వైపులా ఒకేసారి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికన్ దళాలపై క్షిపణి దాడిని ప్రారంభించినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్‌ తాజాగా తమపై క్షిపణులతో దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది. టెహ్రాన్ లో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని చెప్పింది. చాలా ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు వెల్లడించింది. 

Also Read :  అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

Also Read :  జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?

ఇరాన్ మిస్సైల్స్ దూసుకొస్తున్నాయని..ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్ళాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. జెరూసలెం, బీర్ షెబా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది. బీర్‌షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. అందులోని ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు ఇరాన్‌ 6 క్షిపణులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్‌ చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read :  మెగాస్టార్ తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై కీలక అప్డేట్!

ఆపేదే లేదు..

అలాగే మిడిల్ ఈస్ట్ లోని యూఎస్ ఆర్మీ స్థావరాల మీద కూడా దాడులు చేస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతటా పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బాగ్దాద్ కు ఉత్తరాన ఉన్న యూఎస్ సైనిక స్థావరమైన క్యాంప్ తాజిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. AFP నివేదిక ప్రకారం, డ్రోన్ సైనిక స్థావరంలోని రాడార్ వ్యవస్థను ఢీకొట్టిందని.. సైనిక స్థావరం డిస్ట్రాయ్ అయిందని ఏఎఫ్పీ నివేదించింది. 

ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్‌ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఇజ్రాయెలే ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది. మా ప్రజలపై దాడులు ఆపితే, ప్రతిదాడులను కొనసాగించమని ఆయన Xలో పోస్ట్ చేశారు. మా సైనిక చర్యల విరమణపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటాం' అని తెలిపారు.

Also Read: Iraq: సీజ్ ఫైర్ అని చెప్పిన కొన్ని నిమిషాలకే బాగ్దాద్ లో పెద్ద పేలుళ్లు

 

today-latest-news-in-telugu | iran-israel-war | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు