/rtv/media/media_files/2025/06/24/iraq-2025-06-24-07-55-14.jpg)
attack in Iraq
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం...అమెరికా, ఇరాన్ యుద్ధంగా మారింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాలకే ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతటా పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బాగ్దాద్ కు ఉత్తరాన ఉన్న యూఎస్ సైనిక స్థావరమైన క్యాంప్ తాజిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. AFP నివేదిక ప్రకారం, డ్రోన్ సైనిక స్థావరంలోని రాడార్ వ్యవస్థను ఢీకొట్టిందని.. సైనిక స్థావరం డిస్ట్రాయ్ అయిందని ఏఎఫ్పీ నివేదించింది. బాగ్దాద్కు ఉత్తరాన ఉన్న క్యాంప్ తాజి వద్ద ఉన్న ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణి లాంచర్ , రాడార్ సైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసిందని.. ఇప్పుడు అవి కాలిపోతున్నాయని తెలిపారు.
Also Read : HYDలో ఒకే బైక్పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)
Also Read : కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన..సీజ్ ఫైర్ స్టార్ట్
Israel-Iran Ceasefire - Baghdad Explosions
⚡️Radars were bombed at Taji camp, unclear who did it https://t.co/WoNVEk7jpx pic.twitter.com/zhpUBLoH9W
— War Monitor (@WarMonitors) June 23, 2025
Also Read: Gulf Countries: గల్ఫ్ కంట్రీస్ గగనతలం మూసివేత
Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత!
iraq | iran-attacks | today-latest-news-in-telugu