జీడిమెట్ల తల్లి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. మృతురాలు అంజలి చిన్న కూతురు షాకింగ్ విషయాలు మీడియాకు వెల్లడించింది. ‘‘ప్రియుడు శివ, అతడి తమ్ముడు యశ్వంత్తో కలిసి మా అక్కే మా అమ్మను చంపేసింది. నేను ట్యూషన్ నుంచి వస్తుంటే నన్న అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మని చెప్పింది.. పదా వెళ్దామని నన్ను తీసుకెళ్లింది.
Jeedimetla Murder
20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగివచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అని అక్క అంది. చుట్టుపక్కల ఎవరికీ చెప్పొద్దని అక్క చెప్పింది. నేను బయటకు వెళ్లగానే.. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని శివకు ఫోన్ చేసింది.
మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టారు. అమ్మ చనిపోయిందని నిర్ధారించుకొని వాళ్లు వెళ్లిపోయారు. నేను వచ్చి చూసేసరికి అమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశాను. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది.’’ అని నిందితురాలు తేజశ్రీ చెల్లి మీడియాకు తెలిపింది.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ఏం జరిగిందంటే?
హైదరాబాద్ జీడిమెట్లలో మంగళవారం అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా చంపింది. దానికి ఆమె లవర్ తమ్ముడు కూడా హత్యకు సహకరించాడు. ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందన్న కోపంతో ఆమెను గొంతు నులిమి, తలపై కొట్టి చాంపారు. అంజలి సాయుధ పోరాట ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ మనవరాళు. ఆమె ఆశయాలకు వారసురాలిగా చెప్పుకుంటుంది.
Also Read: ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
తేజ శ్రీ స్థానికంగా పదో తరగతి చదువుతుంది. ఆరు నెలల క్రితం శివ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అతని కోసం తల్లిని కూడా చంపడానికి వెనుకాడలేదు శ్రీతేజ. తమ్ముడు యశ్వంత్, లవర్ శివలతో కలిసి తల్లిని కిరాతకంగా హత్య చేసింది. ముగ్గురు కలిసి అంజలి తలపై కొట్టి, గొంతు నులిమి చంపారు. తేజశ్రీపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.