INDIA vs PAKISTAN : పాక్‌ ఉక్కిరి బిక్కిరి.....అంతర్గత ఘర్షణలు...పొరుగు దేశాలతో విబేధాలు

పహల్గాం దాడితో భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యతగా లేదు. దేశంలో అంతర్గత ఉద్రిక్తలతో పాటు పొరుగుదేశాలతో ఉన్న విభేధాల నేపథ్యంలో పాకిస్థాన్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

New Update
INDIA vs PAKISTAN

INDIA vs PAKISTAN

INDIA vs PAKISTAN :  పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ నేపథ్యంలో భారత్‌ పాకిస్థాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే చర్యలకు దిగింది. గతంలో పాకిస్థాన్‌తో చేసుకున్న పలు ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ కు చెందిన మంత్రులు, ఇతర నాయకులు భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. భారత్‌ తమపై దాడి చేస్తే ఎదుర్కొంటామని ప్రగాల్భాలు పలుకుతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యత కొనసాగించలేదు.  ఆ దేశంలో అంతర్గత ఉద్రిక్తలతో పాటు పొరుగుదేశాలతో ఉన్న విభేధాల నేపథ్యంలో పాకిస్థాన్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు ఇతర దేశాలతో ఉన్న విభేధాలను ఒకసారి పరిశీలిద్దాం.

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
 

ఇండో-పాకిస్తాన్ ఘర్షణలు


1947లో బ్రిటిష్ ఇండియా విభజన తరువాత భారతదేశం, పాకిస్థాన్ రాజ్యాలు ఏర్పడినప్పటి నుండి , రెండు దేశాలు అనేక యుద్ధాలు, ఘర్షణలు. సైనిక చర్యలలో పాల్గొన్నాయి. 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం మినహా , కాశ్మీర్ మరియు సీమాంతర ఉగ్రవాదంపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం రెండు రాష్ట్రాల మధ్య సంఘర్షణకు ప్రధాన కారణం.  

Also Read: గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు మరో షాకిచ్చిన మోదీ!

1947--–1948 ఇండో-పాకిస్తాన్ యుద్ధం 


మొదటి కాశ్మీర్ యుద్ధం అని కూడా పిలువబడే ఈ యుద్ధం అక్టోబర్ 1947లో ప్రారంభమైంది, కాశ్మీర్,జమ్మూ రాచరిక రాష్ట్ర మహారాజు భారతదేశంలో విలీనమవుతారని పాకిస్తాన్ భయపడింది . పాకిస్తాన్ సైన్యం మద్దతుతో గిరిజన ఇస్లామిక్ దళాలు రాచరిక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసి ఆక్రమించాయి, భారత సైనిక సహాయం పొందడానికి మహారాజు రాచరిక రాష్ట్రాన్ని భారతదేశ ఆధిపత్యంలోకి చేర్చే ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది . ఐరాస జోక్యంతో భారతదేశం రాష్ట్రంలోని మూడింట రెండు వంతుల ( కాశ్మీర్ లోయ , జమ్మూ,లడఖ్ ) నియంత్రణను పొందింది, అయితే పాకిస్తాన్ కాశ్మీర్‌లో దాదాపు మూడింట ఒక వంతు ( ఆజాద్ కాశ్మీర్,గిల్గిట్-బాల్టిస్తాన్ )ను పొందింది. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను సమిష్టిగా పాకిస్తాన్ పాలిత కాశ్మీర్ అని పిలుస్తారు. 

1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం

జమ్మూ కాశ్మీర్‌లోకి సైన్యాన్ని పంపి, భారత పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రేరేపించడానికి పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ జిబ్రాల్టర్ తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైంది . పశ్చిమ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించడం ద్వారా భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది . 

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!


1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం

ఇది కశ్మీర్‌ సమస్యతో సంబంధం లేకుండా కేవలం బంగ్లాదేశ్‌ విభజన కోసం జరిగిన యుద్ధం. బంగ్లాదేశ్‌ స్వాతంత్ర ప్రకటన తర్వాత యుద్ధం ముగిసింది.


కార్గిల్ యుద్ధం (1999)

1999 ప్రారంభంలో, పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ (LOC) దాటి భారత భూభాగాన్ని కార్గిల్ జిల్లాలో ఆక్రమించాయి . పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టడానికి భారతదేశం ఒక ప్రధాన సైనిక,  దౌత్య దాడిని ప్రారంభించడం ద్వారా విజయం సాధించింది.

బలూచిస్తాన్‌ తో విభేధాలు

పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలనే కోరుకుంది. రష్యా వంటి విస్తరణ శక్తుల నుంచి తమ వలస ప్రయోజనాలను కాపాడుకునేందుకు బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని ఒక స్ధావరంగా ఉపయోగించుకున్నారు. కానీ భారతదేశ విభజన తర్వాత బెలూచిస్తాన్ నాయకులు తమతో విలీనం చేయాలని పాకిస్తాన్ ఒత్తిడి చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇది అక్కడి స్థానికులకు ఏమాత్రం నచ్చలేదు. స్వతంత్ర బెలూచిస్తాన్ కలను సాకారం చేసుకునేందుకు ఉద్యమాన్ని షురూ చేసింది.

Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

బెలూచిస్తాన్ ను భారతదేశం, పాకిస్తాన్ లతోపాటు స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో నాలుగు పూర్వ రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి. ఖరన్, మకరన్, లాస్ బేలా, కలాట్. విభజనకు ముందు, రాచరిక రాష్ట్రాలకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. భారతదేశంలో లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్, ఖాన్ ఆఫ్ కలాత్ , చివరి చివరి ఆప్షన్ ఎంచుకున్నారు. మొదటి మూడు పాకిస్తాన్‌తో వెళ్ళాయి. జిన్నా కూడా మొదట్లో కలత్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించాడు. ఖాన్ జిన్నాను నమ్మాడు. దీంతో కలత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. కానీ విస్తరణవాద పాలనల ముప్పు కారణంగా కలత్ స్వతంత్రంగా ఉండటానికి అనుమతించడం చాలా ప్రమాదకరమని బ్రిటిష్ వారు భయపడ్డారు. కలత్‌ను తమ నియంత్రణలోకి తీసుకురావాలని పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. ఆ సయమంలోనే జిన్నా యూ-టర్న్ తీసుకున్నాడు. అక్టోబర్ 1947లో, పాకిస్తాన్‌లో విలీనాన్ని వేగవంతం చేయాలని జిన్నా ఖాన్‌కు సలహా ఇచ్చాడు. దానికి అతను నిరాకరించాడు. ఖాన్ భారత ఆధిపత్యంలో చేరాలనుకుంటున్నాడనే తప్పుడు వార్తలు పాకిస్తాన్‌ను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో బలూచిస్తాన్ కు అంతర్జాతీయ దేశాల నుంచి మద్దతు లేకుపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ లో చేరాల్సి వచ్చింది.

Also Read: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్
 
విస్తీర్ణం పరంగా చూసినట్లయితే బెలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో 44శాతం ఉంటుంది. అంటే దాదాపు సగం అన్నమాట. ఈ ప్రాంతంలో సహజవాయువు, బొగ్గు, ఖనిజ సంపద కూడా పుష్కలంగా ఉన్నాయి. చైనా అభివ్రుద్ధి చేసిన గద్వార్ ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంత వాసులకు పోయిందేమీ లేదు. పాకిస్తాన్ లోని పంజాబ్ వంటి ఇతర ప్రాంతాల వాళ్లే లబ్ధి పొందారు. బెలూచిస్తాన్ వాసులపై పాకిస్తాన్ సైన్యం చేసిన అరాచకాలకు కొదవేం లేదు. అందుకే బెలూచిస్తాన్ వాసులు కూడా వెనక్కి తగ్గకుండా గతంలో ఐదుమార్లు భారీస్థాయిలో పోరాటాన్ని చేశారు. 2000వ సంవత్సరం నుంచి బెలూచిస్తాన్ మలిదశ పోరాటం షురూ అయ్యిందని చెప్పవచ్చు.

Also Read: నేతలకూ తప్పని టార్చర్..బీజేపీ మహిళా మంత్రికి అసభ్యకరమైన కాల్స్, మెసేజెస్

తాలిబన్లతో తగవులు

అఫ్గాన్​ను పాలిస్తున్న తాలిబన్లకు పాక్ పాలకులకు పడటం లేదు. కొద్దికాలం సద్దుమణిగినట్లు ఉన్నా తెహ్రీక్- ఏ -తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) తిరిగి తీవ్రవాద చర్యలను, బలవంతపు వసూళ్లను, బందీలుగా పట్టుకోవడం వంటి చర్యలను మొదలుపెట్టేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్తాన్ లో తాలిబాన్ తీవ్రవాద వ్యతిరేక నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్​లోని టీటీపీ రహస్య స్థావరాలపై బాంబులు వేస్తామని పాకిస్తాన్ హోమ్ మంత్రి రానా సనోల్లా హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దానికి తాలిబాన్ “ఇది అఫ్గాన్​సామ్రాజ్యాలను (రష్యా, అమెరికా) సమాధి చేసిన దేశం.  (సిరియాలో కుర్దులపై టర్కీ బాంబులు వేయడాన్ని దృష్టిలో పెట్టుకుని) అఫ్గాన్ సిరియా కాదు. పాకిస్తాన్ టర్కీ అంతకంటే కాదు. మాపై సైనికపరమైన దాడి ఆలోచనే రానీయకండి. ఇండియాతో కుదుర్చుకున్న లాంటి ఒప్పందం తిరిగి కుదుర్చుకుంటే మీరే ఇరకాటంలో పడతారు” అని జవాబిచ్చింది. 

Also Read: మోదీజీ సూసైడ్ బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్లి అందరినీ చంపుతా : ముస్లిం మంత్రి

 

pakistan taliban | taliban | balochistan vs pakistan | balochistan | india pak border | india pak war

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు