BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో యుద్ధం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి మార్కూ రూబియో ఇటు భారత్, అటు పాకిస్తాన్ లతో మాట్లాడారని తెలుస్తోంది.

author-image
By Manogna alamuru
New Update
usa

India, Usa, Pakistan

భారత్, పాకిస్తాన్..మధ్యలో అమెరికా. అగ్రరాజ్యం ఇరు దేశాలకు సంధి కుదర్చడానికి ప్రయత్నిస్తోందా..లేకపోతే యుద్ధానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతోందా...అసలేం జరగుతోంది. భారత విదేశాంగ్ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులు, యుద్ధం గురించి ఇద్దరితో విడివిడిగా చర్చించారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పినదాని ప్రకారం మార్కో..జైశంకర్ కు ఫోన్ చేసి పహల్గామ్ దాడిపై తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.  అయితే యుద్ధం జరగకుండా ఉండేలా చూడాలని మార్కో కోరినట్లు చెబుతున్నారు. రెండు దేశాల మధ్యనా ఉద్రిక్తతలు తగ్గించి..శాంతి కాపాడ్డానికి భారత్, పాకిస్తాన్ రెండూ పాటు పడాలని ఆయన కోరారు. 

పాక్ ప్రధానికి కూడా కాల్..

మరోవైపు మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో కూడా మాట్లాడారు. అక్కడ ప్రాంతీయ పరిస్థితులపై షెహబాజ్...మార్కోకు వివరించినట్లు తెలుస్తోంది. భారత దేశం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది ఆరోపించారు. తాము ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి చూస్తున్నామని..కానీ భారత్ తమను దృష్టి మరల్చేలా చేస్తోందని చెప్పారు.  ఫమల్గామ్ దాడితో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని పాక్ ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని భారత్ కు చెప్పాలని షెహబాజ్ అమెరికాను కోరారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | india | pakistan | usa

 

Also Read:Ind-Pak: పాకిస్తాన్ కు మరో షాక్..ఫ్లైట్స్ ఎంట్రీకి నో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు