మాకు ప్రత్యేక దేశం కావాలి.. పాక్ పై తిరగబడ్డ హిందువులు|Sindh Wants Separate Sindhudesh | Balochistan
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చెస్ ఆటను బ్యాన్ చేసింది. చెస్ ఆట జూదానికి మూలంగా పరిగణిస్తున్నామని క్రీడా డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ అన్నారు. దీనికి సంబంధించి మతపరమైన అంశాలను పరిశీలస్తున్నామని తెలిపారు.
పాకిస్తాన్ ఆర్మీపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు భారత సైనయం వాళ్ళకు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బీఏఎల్ వారిపై విరుచుకుపడుతున్నాయి. టీటీపీ కాల్పుల్లో తాజాగా పది మంది పాక్ సైనికులు చనిపోయారని తెలుస్తోంది.
పహల్గాం దాడితో భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యతగా లేదు. దేశంలో అంతర్గత ఉద్రిక్తలతో పాటు పొరుగుదేశాలతో ఉన్న విభేధాల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
భారత్తో ఉద్రిక్తత పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధ ప్రమాదం పొంచిఉంది. ఆఫ్గనిస్తాన్లో కలవాలని తాలిబన్లు, బలుచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని ఏర్పాటు వాదులు పాక్ ఆర్మీపై దాడులు చేస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా పాక్ పరిస్థితి ఉంది.
ఆఫ్గానిస్తాన్ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖున్ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మరో కొత్త రూల్ను ప్రవేశపెట్టారు. ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించకుండా కీటికీలు కూడా ఏర్పాటుచేయొద్దని ఆదేశించారు. మహిళలు తిరిగే వంట గదుల్లో గానీ, బావుల వద్ద గానీ ఎలాంటి కిటికీలు కూడా ఉండొద్దని తేల్చిచెప్పారు.
2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఆఫ్ఘాన్ మహిళల మీద ఆంక్షలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అక్కడ తాలిబన్లు స్త్రీల మీద తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా ఆంక్షలు పెట్టిన తాలిబన్లు...తాజాగా మహిళలు పాటలు పాడొద్దు, మగవారిని చూడొద్దు అంటూ కొత్త రూల్స్ తీసుకువచ్చారు.