BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

భారత్‌తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్‌ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్‌ లోని క్వెట్టాలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు.

New Update
pak

BLA

భారత్‌తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్‌ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్‌ లోని క్వెట్టాలో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు. మార్గల్‌ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి, రిమోట్‌ కంట్రోల్‌ తో పేల్చేశారు.

Also Read: CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్

ఆ దాడికి సంబంధించిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది. కాగా మార్చిలో బీఎల్‌ఏ జరిపిన దాడుల్లో 60 మంది హతమైన సంగతి తెలిసిందే.పాక్‌ నుంచి స్వాతంత్య్రం కోసం బీఎల్‌ఏ పోరాడుతోంది.

ఇదిలా ఉంటే పహల్గామ్ అటాక్‌కు పాల్పడిన ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం చెప్పడానికి రెడీ అయ్యింది. జమ్మూ కశ్మీర్ అంతా భద్రతా బలగాలతో జల్లెడపడుతున్నారు. బండిపోరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఎల్‌ఇటి ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది.

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు బండిపోరాలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ బండిపోరాలో కొనసాగుతున్న ఆపరేషన్ గురించి ఆయనకు వివరించారు. ఆయన పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

Also Read: AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

attack | soldiers | army-soldiers | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు