New Update
/rtv/media/media_files/2025/04/25/9PPkVXez9twKgvNoqO0T.jpg)
telangana man married two young women
తెలంగాణలో విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించిన ఓ యువకుడు.. ఇద్దరినీ ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇద్దరు యువతులతో ప్రేమ
కొమరంభీం జిల్లా జైనూరు మండలానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతులు అడ్డెసర గ్రామంలో నివాసముంటున్నారు. వీరి రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్ గతకొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.
ఇక ఆమెతో పాటు కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. అయితే 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి. ఈ విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్ను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న ఘటన జరిగి నెలరోజులు గడవక ముందే మరో ఘటన
జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతుల రెండో కుమారుడు… https://t.co/eUGAbjDAxNpic.twitter.com/qK6vN6lyV8
దీంతో ముగ్గురు ఫ్యామిలీలు అక్కడకు చేరుకోవడంతో పరిష్కారం దొరికింది. ఇద్దరు అమ్మాయిలూ తమ ప్రేమికుడు చత్రుషావ్ని పెళ్లి చేసుకుంటామని రాయి సెంటర్ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకున్నారు. దీంతో పెళ్లి పత్రికలు ముద్రించి ఒకే మండపంలో వివాహం చేసుకున్నారు.
marriage | latest-telugu-news | telugu-news | telangana
తాజా కథనాలు