Election commission:  ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్‌

రాజకీయ పార్టీలుగా నమోదు చేయించుకుని ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్‌ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు గడచిన ఆరేండ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను డీలిస్ట్‌ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది.

New Update
Election Commission

Election Commission

Election commission : రాజకీయ పార్టీలుగా నమోదు చేయించుకుని ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జలక్‌ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు గడచిన ఆరేండ్ల కాలంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలను డీలిస్ట్‌ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. అలాంటి 345 రాజకీయ పార్టీలను గుర్తించిన ఎన్నికల సంఘం గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను (రిజిష్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీస్‌) గుర్తించి వాటిని డీలిస్ట్‌ చేసేందుకు సిద్దమైంది.

Also Read: అంతరిక్షంలో ఆరోగ్యం బాగోలేదన్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా

పలువురు ఎన్నికల సమయంలో ఏదో ఒక పేరుతో పార్టీని రిజిస్టర్‌ చేయడం, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించుకు తిరగడం చేస్తున్నారు. మరికొందరు రాజకీయ పార్టీల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఆతర్వాత ఏదో ఒక పార్టీలో విలీనం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఆ పార్టీలు ఉన్నాయా? లేవా? అనే సందిగ్దం నెలకొంది. ఈ తరుణంలో ఆయా పార్టీలపై సర్వే చేసి ఆ పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించింది. దీంతో పార్టీల గుర్తింపును రద్ధు చేయాలని నిర్ణయించింది.

Also Read :  గాంధీభ‌వ‌న్‌లో తన్నుకున్న కాంగ్రెస్‌ నాయకులు

కాగా గుర్తింపు రద్దవుతున్న జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే సుమారు 2800కి పైగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. వీటిలో ఇంకా చాలా పార్టీలను తొలగించాల్సి ఉందని పేర్కొంది.  సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలనే నిబంధన ఉంది. అలా కానీ పక్షంలో ఆ పార్టీలను నమోదిత గుర్తింపులేని పార్టీలుగానే పరిగణిస్తారు.

Also Read :  ఏడు రోజులు వరుసగా పచ్చి ఏలకులు తింటే ఏమవుతోందో తెలుసా?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు