India-China: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. భారత్, చైనా దోస్తీ

ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీసా రూల్స్‌ను ఆయన మరింత కష్టతరం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రతీకార సుంకాలతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ అవకాశాన్ని  చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు వీసా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.  

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

Also Read :  ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!

Donald Trump Tarrif Effect

అంతేకాదు భారత పౌరుల కోసం చైనా చాలావలకు వీసా సడలింపులు చేసింది. ఆ దేశాన్ని ప్రయాణాన్ని మరింత ఈజీగా చేసింది. భారతీయులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు చైనాలో ప్రయాణించే వాళ్లకి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.  

చైనా వీసా తక్కువ ధరకు దొరకడం వల్ల భారతీయలకు ప్రయాణం మరింత సులవుగా మారింది. వీసా జారీ చేసేందుకు పట్టే సమయాన్ని కూడా తగ్గించేశారు. ఇది వ్యాపార,విహార యాత్రకు వెళ్లేవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా, భారత పర్యాటకులకు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలను ఇది ప్రోత్సహిస్తోంది. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ట్రేడ్‌వార్ మొదలుపెట్టారు. దీంతో చైనా భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక లాభాలపై ఆధారపడి ఉన్నాయని చైనా దౌత్యవాణిజ్య ప్రతినిధి యూ జింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' చరిత్రలో ప్రతీకార సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ గెలవలేదు. ప్రపంచ దేశాలు అన్నీకలిసి సంప్రదింపులు, బహుళపక్ష సూత్రాలపై నిలపడి ఏకపక్ష చర్యలు, రక్షణవాద విధానాలకు వ్యతిరేకంగా ఉండాలని'' అన్నారు.

Also Read :  ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 

rtv-news | china | donald-trump | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు