BIG BREAKING: దేశంలో భారీ బాంబు పేలుడు
అమృత్సర్లోని మజితా రోడ్ బైపాస్లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమృత్సర్లోని మజితా రోడ్ బైపాస్లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇది ఉగ్రవాది దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
60ఏళ్ల వ్యక్తి బలవంతంగా 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. రామాజంనేయులు అనే వ్యక్తి మైనర్ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్లాడు. ఇష్టం లేని ఆ అమ్మాయి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యూపీకి చెందిన వాసి సాగర్ మియాపూర్లోని డెలాయిట్ డ్యాన్స్ స్టూడియోలో మాస్టర్గా పనిచేస్తున్నాడు. యజమాని పరమేశ్ స్టూడియోకు వెళ్లి చూడగా అక్కడే ఉరేసుకుని సాగర్ మృతి చెందాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడని విఫలమైన బాధలో చనిపోయినట్లు తెలుస్తోంది.
హర్యానాలోని పంచకులలో సంచలనం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా ఈ ఏడు మృతదేహాలు ప్రముఖ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.
సిరిసిల్లలో దారుణం జరిగింది. చందుర్తి గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ(60)ను అదే గ్రామానికి చెందిన మనోజ్ పెద్దమ్మ గుడి ముందు వేట కొడవలితో నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఆమె తల, చేతులు నరికేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీ తెనాలీలో పోలీసులు యువకులను నడిరోడ్డుపై చితకబాదారు. గంజాయి మత్తులో తనపై దాడిచేశారనే కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు లంచం అడిగితే ఇవ్వనందుకే తప్పుడు కేసు పెట్టి చావగొట్టారని బాధితులు చెబుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.
పోటీపరీక్షలు అనగానే భయామో, లేక విజయం సాధించలేమన్న అపనమ్మకమో కానీ పోటీ పరీక్షల కోచింగ్కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా 2025లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 15కు చేరింది.
ఉత్తరప్రదేశ్లో మరో గురుమూర్తి తరహా ఘటన చోటు చేసుకుంది. సీరియల్ కిల్లర్ రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్ మనుషులను చంపి వారి తలను మరిగించి సూప్ తాగుతాడని పోలీసుల విచారణలో తేలింది. ఇతనికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.