/rtv/media/media_files/2025/05/05/oTtmaZinHJQvN6DMvTUM.jpg)
acdnt Photograph: (acdnt )
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ-, హైదరాబాద్ జాతీయ రహదారి మూలపాడు వద్ద కూలీలతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను బొలెరో ఢి కొట్టింది. ఇద్దరు మహిళలు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.
Also Read : నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!
Also Read : పాకిస్థాన్ గొంతు ఎండేలా భారత్ మరో సంచలన నిర్ణయం
Vijayawad - Hyderabad N.H Road Accident
ఇదిలా ఉంటే.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. ముందు వెళ్తున్న కంటైనర్ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కారు వెనుక సీట్లో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read: 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్ మేడిపల్లి, బోడుప్పల్కు చెందిన యశ్వంత్ (25), చార్లెస్ (25)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read : పాకిస్తాన్కి రాజ్నాథ్ సింగ్ మరో స్ట్రాంగ్ వార్నింగ్
vijayawada | hyderabad | road-accident | telugu-news | today telugu news | latest-telugu-news | andhra-pradesh-news | andhra-pradesh-crime-reports | telugu crime news