Father Kil*led Children In Vijayawada | నాకు పిల్లలుగా పుట్టడమే వాళ్ల పాపం | Vijayawada Crime | RTV
విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
విజయవాడ రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయి బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకుని రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బెంజ్ సర్కిల్లో ఉదయం ఓ భవనంలో కరెంట్ షాకుతో ముగ్గురు మృతి చెందారు. ఒకరిని ఒకరు కాపాడుకోబోయి మృత్యువాతపడగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారత ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ ఇప్పుడు విజయవాడ, బెంగళూరుల మధ్య కూడా నడవనుంది. దీని ద్వారా తొమ్మిది గంటల్లో గమ్యస్థానానికి చేరవచ్చును. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.
విజయవాడ-మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు డ్రింక్స్ కేసులను తీసుకెళ్తున్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మూలపాడు వద్ద కూలీలతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను బొలెరో ఢి కొట్టింది. ఇద్దరు మహిళలు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.