/rtv/media/media_files/2025/05/04/qTdofE0ywqAFJXTrzTbE.jpg)
Defence Minister Rajnath Singh
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు మరో వార్నింగ్ ఇచ్చారు. దేశంపై దాడి చేసినాళ్లకి గట్టి సమాధానం చెబుతామన్నారు. ప్రధాని పనితనం, పట్టుదల గురించి ప్రజలకు తెలుసన్నారు. చైనాతో కలిసి ఇండియాతో కుట్రకు పాల్పడేవాళ్లకు ఊహించని విధంగా సమాధానం ఇస్తామన్నారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్థాన్లో ఏజెన్సీలు, దళాలు హై అలర్ట్లో ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: ఉక్రెయిన్పై అణ్వాయుధాలతో దాడి !.. పుతిన్ కీలక ప్రకటన
ఇక పాకిస్థాన్కు మరో బిగ్షాక్ తగిలింది. ముస్లిం దేశాలు పాక్ను ఏకాకి చేశాయి. ఆ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ముస్లిం దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇండియా వైపే ఉన్నాయి. భారత్తో ఆ దేశాలకు బలమైన వ్యాపార సంబంధాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఏకపక్షంగా పాకిస్థాన్కు సపోర్ట్ ఇచ్చేందుకు సౌదీ నిరాకరించింది.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వాయుసేనతో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని అన్నారు. పాకిస్థాన్కు చెందిన ఏఆర్వై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే తమ గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు రావడానికి యత్నించాయని.. వాటిని తాము అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: పాక్ కు భారత సైనిక సమాచారం లీక్...ఇద్దరు ఇంటి దొంగల అరెస్ట్
Also Read: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
rtv-news | national-news