/rtv/media/media_files/2025/06/20/karnataka-wife-2025-06-20-16-20-50.jpg)
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళూరులోని బంట్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణ ఘటన.
మిట్టమజలు నివాసి అయిన తిమ్మప్ప మూల్యకు.. నవూర్లోని బండగుండి గ్రామానికి చెందిన జయంతితో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. తిరగని ఆస్పత్రి లేదు.. మొక్కని దేవుడు లేడు.. 15 ఏళ్లుగా అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి దంపతులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సరిగ్గా పెళ్లైన 15 ఏళ్ల తర్వాత జయంతి గర్భం దాల్చింది. దీంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ ఇంట్లోకి పసిప్రాణం రాబోతుందని తెలిసి ఇళ్లంతా కోలాహాలంగా మారిపోయింది. ఈ మేరకు జులై 2న బేబీ షవర్ పార్టీ కూడా ప్లాన్ చేశారు ఆ జంట.
Also Read : Secunderabad మిలిటరీ ఏరియాలో చొరబాటు.. నలుగురు అరెస్ట్
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
చిన్న గొడవ చావుకు కారణం
అప్పటిదాక ఆనందంలో మునిగితేలిన తిమ్మప్ప, జయంతి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అదికాస్త పెరిగి పెద్దదై ఇద్దరి చావుకు కారణమైంది. 15 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురుచూసిన తిమ్మప్ప.. 15 నిమిషాలు భార్యపై కోపాన్ని ఆపుకోలేకపోయాడు. సహనం కోల్పోయి భార్య గొంతు నులిమి చంపేశాడు. భార్య చనిపోయిందని తెలిసి షాకయ్యాడు. వెంటనే మనస్తాపంతో తాను కూడా ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. మృతుల బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఒక చిన్న విషయంపై గొడవ జరిగిందని.. కోపంలో భార్యను చంపి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
Also Read : కొండా మురళిపై చర్యలు.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!
Also Read : మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. అమెరికాపై ఇరాన్ సంచలన ప్రకటన!
karnataka | wife | husband | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu