/rtv/media/media_files/2025/06/20/hyd-road-accident-2025-06-20-15-18-18.jpg)
HYD Road Accident
పిల్లల కోసం తల్లి చేసే త్యాగం మాటల్లో చెప్పలేము. చివరి క్షణం వరకు తల్లి పిల్లల యోగా క్షేమాలు గురించి ఆలోచిస్తుంది. ఈ సమాజానికి తల్లి విలువ ఏంటో చెప్పటం ఎవరి తరం కాదు. అయితే తాజాగా ఓ తల్లి త్యాగం వల్ల బిడ్డ ప్రాణాలు పోకుండా కాపాడింది. హైదరాబాద్లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. సొంత ప్రాణాన్ని త్యాగం చేసి తన కుమార్తె ప్రాణాలను రక్షించిన ఓ ఏడు నెలల గర్భిణి తల్లి త్యాగం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. బాలనగర్కు చెందిన సయ్యద్ జమీర్, ఆస్ర ఫాతిమా (29) దంపతులు అత్తాపూర్ ఠాణా పరిధిలోని ఉప్పర్పల్లిలో నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉండగా, ఫాతిమా ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి.
Also Read : మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. అమెరికాపై ఇరాన్ సంచలన ప్రకటన!
నిర్లక్ష్యంగా కారు డోర్ తీయటంతో..
గురువారం రోజున భర్త జమీర్ ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు అత్తాపూర్పై వంతెన సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం ఫాతిమా, జమీర్ తమ కుమార్తెతో కలిసి బైక్పై ఇంటికి తిరిగి వస్తున్నారు. అయితే వారు నివాసానికి చేరువగా రాగానే దారుణం జరిగింది. ప్రధాన రహదారిపై 198వ పిల్లర్ సమీపంలో నిలిచిన ఓ కారు నుంచి డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా అజాగ్రత్తగా డోర్ను తెరిచాడు. ఇదే సమయంలో బైక్పై వెళ్తున్న జమీర్ వారి బైక్ ఆ కారు డోర్కు తగలింది. తగిలిన ఉద్ధంములో వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఫాతిమా, ఆమె కుమార్తె కుడివైపు ఎగిరిపడ్డారు. అదే సమయంలో అదే దారిపై వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఫాతిమాకు ఢీకొనటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!
కానీ చివరి క్షణాల్లో తన ప్రాణం మీద ముప్పు స్పష్టంగా గ్రహించిన ఫాతిమా, అత్యంత వేగంగా తన కుమార్తెను బస్సు దారిలోనుంచి దూరంగా నెట్టి ప్రాణాలను రక్షించారు. ఆమె సాహసంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరినీ కన్నీళ్లు పెట్టించింది. తల్లిగా ఫాతిమా చూపించిన ప్రేమ, త్యాగం మాటల్లో చెప్పలేనిది. నిర్లక్ష్యంగా కారు డోర్ తెరిచిన వ్యక్తి ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరలా గుర్తు చేస్తోంది. ఒక తల్లి చేసిన త్యాగం ఈ సమాజానికి తల్లితన విలువ ఏంటో గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్
Also Read : ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
(telugu crime news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | pregnant-woman)