వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలకు సంబంధించి పీసీసీ అబ్జర్వర్ల నుంచి నివేదిక కోరామాన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హక్కుల విషయంలో ప్రేమ ఉంటే ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
అందుకే బీఆర్ఎస్ అఖిలపక్ష సమావేశానికి రాలేదు..
గతంలో తాము చేసిన తప్పులు, రాజీ పడ్డ విషయం బయటకు వస్తుందని ఆ పార్టీకి భయమన్నారు. బచావత్ తీర్పు 968 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. ఇందులో రాజీ ఉండదని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాజీ కారణంగానే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సైతం స్పందించారు. పోటీకి అనేక మంది ఆసక్తి చూపడంలో తప్పు లేదన్నారు. కాంగ్రెస్ లో అభ్యర్థి ఖరారుకు ప్రాసెస్ ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
BIG BREAKING: కొండా మురళిపై చర్యలు.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!
కొండా మురళి వ్యవహారంపై పీసీసీ అబ్జర్వర్లను నివేదిక ఇవ్వమని కోరినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. బనకచర్ల విషయంలో తమ తప్పులు బయటపడతాయన్న భయంతోనే బీఆర్ఎస్ అఖిలపక్ష సమావేశానికి రాలేదన్నారు.
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలకు సంబంధించి పీసీసీ అబ్జర్వర్ల నుంచి నివేదిక కోరామాన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హక్కుల విషయంలో ప్రేమ ఉంటే ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
అందుకే బీఆర్ఎస్ అఖిలపక్ష సమావేశానికి రాలేదు..
గతంలో తాము చేసిన తప్పులు, రాజీ పడ్డ విషయం బయటకు వస్తుందని ఆ పార్టీకి భయమన్నారు. బచావత్ తీర్పు 968 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. ఇందులో రాజీ ఉండదని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాజీ కారణంగానే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సైతం స్పందించారు. పోటీకి అనేక మంది ఆసక్తి చూపడంలో తప్పు లేదన్నారు. కాంగ్రెస్ లో అభ్యర్థి ఖరారుకు ప్రాసెస్ ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.