Husband: భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త.. ఎందుకంటే?

భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భర్త ఆమెని దారుణంగా హత్య చేశాడు. తల నరికి భర్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్, 26ఏళ్ల మానస భార్యా భర్తలు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది.

New Update
Husband killing wife (1)

భార్యకు వివాహేతర సంబంధం ఉందని తల నరికి భర్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్, 26ఏళ్ల మానస భార్యా భర్తలు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది. కొంతకాలం క్రితం వారు హీలలిగే గ్రామంలో ఇంటికి అద్దెకు తీసుకున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ పనికి బయలుదేరాడు. మానసకు మరుసటి రోజు ఉదయం తిరిగి వస్తానని చెప్పాడు. అయితే, అతను ఆ రాత్రే పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో మానస మరొక వ్యక్తితో ఉందని భర్త చెప్పాడు. భార్యని శంకర్ నిలదీయగా గొడవ జరిగి మానస ఇంటి నుండి బయటకు వెళ్లిందని చెబుతారు.

Also Read :  అరాచకం.. 11,000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో కొత్త ఫోన్.. పిచ్చెక్కిపోవాల్సిందే భయ్యా!

Husband Killed Wife

Also Read :  ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఆ తర్వాత నుంచి మానస చాలాసార్లు ఇంటికి తిరిగి వచ్చి శంకర్‌ను వేధించిందని ఆరోపించారు. హత్యకు ముందు రోజు(శుక్రవారం) రాత్రి, ఆమె మళ్ళీ ఇంటికి వచ్చి శంకర్‌తో గొడవకు దిగింది. దీంతో శంకర్ ఆగ్రహానికి లోనై మానస తల నరికి దారుణంగా హత్య చేశాడు.  ఆమె తలను తీసుకొని సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులకు లొంగిపోయాడు. సూర్యనగర్ స్టేషన్ నుండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శంకర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Also Read :  మీ బిడ్డను రాత్రి నిద్రపుచ్చేటప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తుందా? ఇలా చేయండి!

Also Read :  హగ్ కి రూ. 600.. చైనాలో 'మ్యాన్ మమ్స్' ట్రెండ్!

 

extramarital-affair | extramarital-affairs | police-station | husband | surrender | husband-killed-his-wife | husband-killed-wife | latest-telugu-news | telugu crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు