SSMB 29 Updates: మీ జీవితంలో ఇలాంటి సినిమా చూసి ఉండరు: విజయేంద్ర ప్రసాద్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి కథ భారతదేశంలో ఇంతవరకు రాలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

New Update
ssmb 29 movie updates

ssmb 29 movie updates

SSMB 29 Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్(Gobal Action Adevnture) ప్రాజెక్ట్ SSMB29, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ SSMB29. సెట్స్‌పైకి వెళ్లకముందే, రూ. 2000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే ఆమె హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పిన వార్తలపై, అధికారికంగా చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో చాలా సైలెంట్ గా జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) ఈ సినిమా కథను రాసిన విషయం తెలిసిందే. ఆయన, ఎప్పటిలాగే భారీ స్థాయిలో ఈ కథను రూపొందించారని, పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. దీంతో ఈ సినిమా పై  ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి..

ఊహకు అందని ట్విస్టులు, మలుపులు..

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. SSMB29 పూర్తిగా అడ్వెంచర్ జోనర్‌లో ఉంటుందని, ఇందులో ఊహకు అందని ట్విస్టులు, మలుపులు చాలా ఉంటాయని చెప్పారు. ఇలాంటి కథతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా  భారతదేశంలో రాలేదు అని అన్నారు. మహేష్ బాబు తన కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదని అన్నారు. ఈ సినిమాకు కథను రాసేందుకు ఆయన చాలా కసరత్తు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read:  వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?

ఏదైమైనప్పటికీ ఈ సినిమా పై భారీ అంచనాలు రోజు రోజుకు ప్రేక్షకుల్లో పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌(Durga Arts Banner)పై కేఎల్ నారాయణ(KL Narayana) నిర్మిస్తున్నారు. తుఫాన్ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు జక్కన్న. 1st పార్ట్ 2027లో విడుదల చేసి, రెండో పార్టీను 2029లో విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు మరి..

Also Read: Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు