BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్
క్రిప్టోమార్కెట్లు నిన్న జోరు ప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 4500 డాలర్లు లాభపడింది. అంటే రూ.3.82 లక్షలు అనమాట. మళ్లీ 1,01,125 డాలర్ల వద్ద ముగిసింది.
క్రిప్టోమార్కెట్లు నిన్న జోరు ప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 4500 డాలర్లు లాభపడింది. అంటే రూ.3.82 లక్షలు అనమాట. మళ్లీ 1,01,125 డాలర్ల వద్ద ముగిసింది.
కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఏఐ ఆధారంగా పనిచేసే ఆటో డబ్బింగ్ ఫీచర్ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోల్లోని వాయిస్ను ఆటోమేటిక్గా డబ్ చేసి వేరే భాషల్లోకి మార్చి వినిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధర అమాంతం పెరిగిపోతుంది. NECC గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించగా.. 30 గుడ్ల ట్రే ధర రూ.186గా ఉంది. వెన్కాబ్ లాంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు డజన్ గుడ్లకు రూ.85 లు వసూలు చేస్తున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర రూ.7.08 ఉంది.
నేడు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.290 తగ్గి రూ.77,610గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అలర్ట్ జారీ చేశారు. +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ కాల్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వడని సైబర్ పోలీసులు చెప్తున్నారు.
ఫేక్ అకౌంట్లతో నకిలీ ఆర్డర్లు చేసి సైబర్ నేరగాళ్లు మీషోకి రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు. ఆర్డర్లు పెట్టి ఫేక్వి రిటర్న్ చేసేవారని కంపెనీలో ఉన్నతాధికారి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రెడీమేడ్, బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీని పెంచున్నట్లు సమాచారం.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. జంతు సంరక్షణ కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ, దాని వ్యవస్థాపకుడ్ని లక్ష్యంగా చేసుకొని ఉన్న వీడియోను తొలగించమన్నప్పటికీ తొలగించకపోవడంతో పిచాయ్కు కోర్టు నోటీసులు ఇచ్చింది.