/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
నిన్నటి లాభాల ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈరోజు భారత స్టాక్ మార్కెట్లో(indian-stock-market) సూచీలు సానుకూల ధోరణితో ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ ఇది ఎక్కువ సేపు కొనసాగలేదు. రెండు ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. దాంతో పాటూ సెన్సెక్స్(sensex-today) 100 పాయింట్లకు పైగా పడిపోయి 84,450 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ(nifty) దాదాపు 50 పాయింట్లు తగ్గి 25,850 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్లోని 30 స్టాక్లలో ఇరవై మూడు స్టాక్లు క్షీణించాయి. హిందూస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 3.5% వరకు పడిపోయాయి.వాటితో పాటూ పవర్ గ్రిడ్, టైటాన్ కూడా నష్టాల్లో ఈదులాడుతున్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్లలో ముప్పై రెండు స్టాక్లు క్షీణించాయి. NSEలో FMCG, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్ రంగాలు క్షీణించాయి. ఆటో , మెటల్ స్టాక్లు పెరిగాయి.
Markets kick off for the day!
— IndiaToday (@IndiaToday) October 24, 2025
Listen in to #Business Today's @shail_bhatnagar as he analysis over the current market trends.#MarketsOpen#BusinessToday | Aabha Bakaya pic.twitter.com/Rp48MeCoYh
Also Read : గుడ్న్యూస్.. బ్యాంకు ఖాతాలపై కీలక అపడేట్
లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు..
భారత మార్కెట్లు నేపచూపులు చూసతుంటే..అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు బాగా పెరిగాయి. ఆసియా మార్కెట్లలో, కొరియా కోస్పి 1.96% పెరిగి 3,920 వద్ద మరియు జపాన్ నిక్కీ 1.35% పెరిగి 49,299 వద్ద ట్రేడవుతున్నాయి.హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.47% పెరిగి 26,090 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.42% పెరిగి 3,938 వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్ 23న US డౌ జోన్స్ 0.31% పెరిగి 46,734 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 0.89% , S&P 500 0.58% లాభపడ్డాయి.
US stocks advanced, with the Dow adding almost a third of a percent, the S&P 500 gaining more than half a percent and the Nasdaq climbing roughly nine-tenths of a percent https://t.co/N14BIdpFmTpic.twitter.com/5j8E3bfvtx
— Reuters (@Reuters) October 24, 2025
Also Read : ఆల్టైమ్ హైలో నిఫ్టీ..భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Follow Us