Venkaiah Naidu: రాజకీయం ఓ బూతు.. తిరుమల సాక్షిగా వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు!

రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారంటూ  తిరుపతి మేధావుల సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వికసిత్ భారత్ వైపు నడవాలని, అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.

New Update
Venkaiah Naidu

Venkaiah Naidu

జకీయాల్లో విలువలు తగ్గిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏపీ ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలందరినీ ప్రజలు ఇంటికి పంపించారని, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన వారిని ఘోరంగా ఓడించారని చెప్పారు. ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్ లతోనే ప్రజలు సమాధానం చెబుతున్నారని, తుపాకీతో భయపెట్టాలని చూసిన వారు ఆ తుపాకీకే బలయ్యారని గుర్తు చేశారు. 

Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!

ప్రజల్లోను మార్పు రావాలి..

ఎన్నికలంటే ప్రజల్లోను మార్పు రావాలి. ఉచితమని ప్రకటన చేసే ప్రతి పార్టీని ప్రశ్నించాలి. ఉచితం అనుచితానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. విద్య, వైద్యంను ఉచితంగా ఇస్తే తప్పేమీ లేదు. ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, ప్రాంతాలకే ప్రాధాన్యత పెరిగింది. వచ్చే ఎన్నికల్లో అవేమీ ఉండకూడదు. నేను ఏ రోజు జేబులో నుంచి రూపాయి తీయలేదు. రూపాయి వేసుకోలేదు. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్లాలనుకుంటే ఉన్న పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని సూచించారు. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఇక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమగ్రంగా మార్చాలన్నారు. భారతదేశం వికసిత్ భారత్ వైపు నడవాలని, అందుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నాలుగుసార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నికను సిఫార్సు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఒకే ఎన్నికను తీసుకురావడం లేదన్నారు. ఎప్పటి నుంచో ఒకే ఎన్నిక విధానం ఉందని, ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితే 12వేల కోట్ల రూపాయలు మిగులుతాయని తెలిపారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

venkaiah-naidu | today telugu news | telugu-news | tirupathi | breaking news in telugu | today-news-in-telugu | latest-telugu-news | andhra-pradesh-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు