/rtv/media/media_files/2025/04/07/TdkgiBP8E7FVHh7OC9dZ.jpg)
Deputy Collector dies in road accident Annamayya district of AP Photograph: (Deputy Collector dies in road accident Annamayya district of AP)
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద మంగళవారం కోటబొమ్మాళి- శ్రీకాకుళం హైవేపై జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. ఒడిశాకు చెందిన తండ్రీకుమార్తెలు సుశాంత్ కుమార్ (52), సంతోషి (3)తో పాటు గోకుల పండా (33) కారులో సింహాచలం వెళ్తున్నారు.
ఎత్తురాళ్లపాడు వద్ద కారు నిలిపి కాలకృత్యాల కోసం దిగారు. ఈ క్రమంలో ఓ వాహనం వారిని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆ ముగ్గురిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. తండ్రీకుమార్తెలది గంజాం జిల్లా మైసంపూర్ గ్రామం. గోకుల పండా బ్రహ్మపురలోని గేట్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Also Read : సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడ జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : భార్య టార్చర్ భరించలేకపోతున్నా: ఆర్మీ జవాన్
నెల్లూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని - ఆదురుపల్లికి చెందిన జమీల అనే మహిళకు మక్బూల్ జాన్ అనే వ్యక్తికి మధ్య కొంతకాలంగా ఇంటి వివాదం కొనసాగుతుంది. ఈ విషయంపై ఎమ్మార్వో, ఎస్ఐ విచారణ చేపట్టి.. ఇల్లు ఆమెకే చెందుతుందని తేల్చి చెప్పారు. కానీ ఈ స్థల వివాదంలో సీఐ వేమారెడ్డి జోక్యం చేసుకున్నారని ఆమె తెలిపింది.
Also Read : ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం - వీడియో
Also Read : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ డేట్ ఫిక్స్..
road-accident | three-killed | highway | srikakulam | latest-telugu-news | accidents on highways | telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news