/rtv/media/media_files/2025/06/10/Ec2HMfR7mlFJgUNzkTBi.jpg)
Engineering Counselling
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై కీలక అప్డేట్ వచ్చింది. జులై మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' కొందరు ఎలాంటి పర్మిషన్లు లేకుండానే విద్యాసంస్థలు నడుపుతున్నారు. వాటిలో విద్యార్థులు చేరుతున్నారు.
Also read: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మరోసారి కులగణన
నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్స్ఎల్టెక్ ఎడ్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ సంస్థలకు నోటీసులు పంపించాం. దీనిపై వివరణ కోసం జూన్ 13 వరకు విద్యాసంస్థలకు గడువు ఇచ్చాము. డీమ్డ్ వర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని ఆయా విద్యాసంస్థలు చెబుతున్నాయి. అలాగే ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
Also Read: 30 ఏళ్లకే 10 పెళ్లిళ్లు.. అడ్డంగా బుక్కైన నిత్య పెళ్లికూతురు!
ప్రస్తుతం డీమ్డ్ వర్సిటీల అంశం కోర్టు పరిధిలో ఉంది. బీ కేటగిరీ సీట్ల అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సీట్ల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాశాం. సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తున్నాం. కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్లైన్ను ఏర్పాటు చేస్తాం. అలాగే ఉన్నత విద్యా మండలిలో సంస్కరణలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని'' బాలకిష్టా రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ప్రధాని మోదీకి మల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?
Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం - వీడియో