లడ్డులో ఉంది అసలు నెయ్యే కాదు..| Shocking Facts In Tirumala Laddu Adulteration | CM Chandrababu |RTV
తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం వెళ్లడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు.
వేసవిసెలువులు ముగింపుకు రావడంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి భక్తులతో పోటెత్తింది. శుక్రవారం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ వర్గాలు తెలిపాయి.
తిరుమలలో ముగ్గురు పోలీసులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్తో పలు వాహనాలను ఢీకొట్టారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు.
తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.
వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ఒకేసారి క్యూలైన్లకు భక్తులను వదలడంతో ఒకరినొకరు తోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో భక్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు.