/rtv/media/media_files/2025/06/18/Jagan Convoy Vehicle Kills a Man in Guntur-1142962a.jpg)
Jagan’s Convoy Vehicle Kills a Man in Guntur
మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జగన్ బుధవారం పల్నాడు జిల్లా పర్యటను వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
Also Read: దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి
YS Jagan Convoy Accident
అయితే జగన్ కాన్వాయ్ వెంట ఉన్న ఒక కారు లాల్పురం హైవే దగ్గర ఓ వృద్ధుడిని ఢీకొంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వృద్ధుడిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. చివరికి స్థానికులు స్పందించి ఆ వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. దీంతో వైసీపీ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: కాల్పుల విరమణలో మీ పాత్రేమిలేదు..ట్రంప్కు ఝలక్ ఇచ్చిన మోదీ
జగన్ రెడ్డి ప్రచార పిచ్చకి మరొకరు బలయ్యారు. సత్తెనపల్లి వెళ్తూ, ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీ కొట్టింది. కనీస మానవత్వం లేకుండా, గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోగా, స్పందించిన పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్పించారు.… pic.twitter.com/EBqQ8IQmkh
— Telugu Desam Party (@JaiTDP) June 18, 2025
Also Read : Online Trading: నిర్మలా సీతారామన్ AI వీడియోతో రూ.20లక్షలు ఫసక్.. HYD వైద్యురాలికి కుచ్చుటోపి!
Also Read : Harbhajan Singh: ‘నేను ఒక రోజు పంజాబ్ సీఎం అయితే’.. క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్
telugu-news | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | telugu crime news | jagan-convoy-accident