Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి

మాజీ సీఎం జగన్‌ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.

New Update
Jagan’s Convoy Vehicle Kills a Man in Guntur

Jagan’s Convoy Vehicle Kills a Man in Guntur

మాజీ సీఎం జగన్‌ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జగన్ బుధవారం పల్నాడు జిల్లా పర్యటను వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. 

Also Read: దేశవ్యాప్తంగా 200 కొత్త రైళ్లు.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి

YS Jagan Convoy Accident

అయితే జగన్ కాన్వాయ్‌ వెంట ఉన్న ఒక కారు లాల్‌పురం హైవే దగ్గర ఓ వృద్ధుడిని ఢీకొంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వృద్ధుడిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. చివరికి స్థానికులు స్పందించి ఆ వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. దీంతో వైసీపీ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read: కాల్పుల విరమణలో మీ పాత్రేమిలేదు..ట్రంప్‌కు ఝలక్‌ ఇచ్చిన మోదీ

Also Read :  Online Trading: నిర్మలా సీతారామన్‌ AI వీడియోతో రూ.20లక్షలు ఫసక్.. HYD వైద్యురాలికి కుచ్చుటోపి!

Also Read :  Harbhajan Singh: ‘నేను ఒక రోజు పంజాబ్ సీఎం అయితే’.. క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్

 

telugu-news | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | telugu crime news | jagan-convoy-accident

Advertisment
Advertisment
తాజా కథనాలు