/rtv/media/media_files/2025/06/18/indian railways to launch 200 new trains soon (1)-257a6f51.jpg)
indian railways to launch 200 new trains
దేశవ్యాప్తంగా ట్రైన్ జర్నీని ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. దూర ప్రయాణాలు చేసేందుకు రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగానూ, ఆహ్లాదకరంగానూ ఉంటుంది. అందువల్లే చాలా మంది వీటినే ఎంచుకుంటారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు ఇస్తూ ఉంటుంది. తరచూ ఏదో ఒక మార్పుతో ప్రయాణికుల సౌకర్యాలను మరింత సులభతరం చేస్తుంది.
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !
indian railways
తాజాగా భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ నిన్న (జూన్ 17న) ఒక ప్రకటన చేశారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు.
यात्रियों की सुविधा के लिए:
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2025
🚉 50 नई नमो भारत ट्रेन
🚉 100 नई MEMU ट्रेन
🚉 50 नई अमृत भारत ट्रेन pic.twitter.com/2hM92vq3Ep
ఈ కొత్త రైళ్లలో 100 మెమూ (MEMU) రైళ్లు, 50 నమో భారత్ రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయని అన్నారు. ఇవి ప్రయాణికుల సౌకర్యం, సేఫ్టీ, సమర్థతను మెరుగుపరచడానికి రూపొందించినవని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే నమో భారత్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇందులోని స్టాండింగ్, సీటింగ్ ఏర్పాట్లు చూడటానికి మెట్రో రైళ్లలో మాదిరిగా ఉంటాయి.
Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
ఇక మెమూ (MEMU) రైళ్లు తక్కువ దూర ప్రయాణాలకు ఎంతో సౌకర్యంగానూ, అనుకూలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రద్దీగా, ఎక్కువ ట్రాఫిక్ ఉండే రూట్లలో జర్నీ సమయాన్ని తగ్గించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ రైళ్లు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.