/rtv/media/media_files/2025/06/18/nirmala sitharaman fake ai video scam hyderabad Doctor Loses Rs 20 Lakh-28c8db71.jpg)
nirmala sitharaman fake ai video scam hyderabad Doctor Loses Rs 20 Lakh
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తరచూ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది లక్షలు, కోట్లలో తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. తక్కువ మొత్తంలో డబ్బులు పెడితే.. అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. అందులో లాభాలు వచ్చినట్లు చూపించి.. నమ్మకం కలిగిస్తున్నారు. తీరా విత్ డ్రా చేసుకునేటప్పుడు డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
nirmala sitharaman fake ai video scam
తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఈసారి మాత్రం కేటుగాళ్లు కొత్త పన్నాగం పన్నారు. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ వాయిస్తో ఒక ఏఐ వీడియో రూపొందించారు. దాని ద్వారా హైదరాబాద్కు చెందిన ఒక వైద్యురాలి వద్ద రూ.20 లక్షలు కొట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
HYDకి చెందిన 71 ఏళ్ల మహిళా వైద్యురాలి వాట్సాప్కు కొన్ని నెలల క్రితం ఫేస్బుక్ లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే నిర్మలా సీతారామన్ వాయిస్తో ఒక వీడియో ఉంది. అందులో ఆన్లైన్లో తక్కువ మొత్తంలో డబ్బులు పెడితే బాగా లాభాలు పొందొచ్చని నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఉండటంతో ఆ వైద్యురాలు నమ్మేసింది.
సరిగ్గా అప్పుడే ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ట్రేడింగ్లో పెట్టుబడి ప్రణాళికను ఆవతల వ్యక్తి వివరించాడు. దీంతో ఇదంతా నిజమేనని ఆ వైద్యురాలు నమ్మింది. అది అచ్చం నిర్మలా సీతారామన్ గొంతుతో ఉన్న వీడియో కావడంతో పెట్టుబడి పెట్టేందుకు ఓకే చెప్పింది. ఇదే అదునుగా భావించిన కేటుగాల్లు.. ఆమె నుంచి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు తీసుకుని ఫేక్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేశాడు.
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !
అందులో రిజిస్ట్రేషన్ చేయించి ఫిన్ బ్రిడ్జ్ అనే కంపెనీలో మొదట రూ.20వేలు పెట్టుబడులు పెట్టించాడు. అప్పుడు బాగా లాభాలు వచ్చినట్లు.. ఆమె ట్రేడింగ్ అకౌంట్లో అమెరికా డాలర్లలో చూపించి నమ్మించాడు. ఇలా విడతలవారీగా రూ.20.13 లక్షలు డిపాజిట్లు చేయించి.. మొత్తం 79,850 యూఎస్ డాలర్లు (రూ.68.67 లక్షలు) లాభాలు వచ్చినట్లు చూపించాడు. కానీ వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించలేదు. దీంతో ఆమె అడిగితే.. విత్ డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పెట్టాలని.. లేకపోతే అవి రావని చెప్పారు. దీంతో తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది.