/rtv/media/media_files/2025/02/03/EmSZdHD6RPWQeQfSB0fY.jpg)
trump and modi Photograph: (trump and modi )
PM Modi : పాకిస్థాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్కు తేల్చి చెప్పారు. జీ7 దేశాల సమావేశానికి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ సమావేశాల నుంచి అర్థంతరంగా వెళ్లిపోవడంతో మోదీ నేరుగా ట్రంప్కు కాల్ చేసి మాట్లాడినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇద్దరి మధ్య దాదాపు 35 నిమిషాలపాటు జరిగిన ఫోన్ సంభాషణలో మోదీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారని తెలిపింది. ఆఫరేషన్ సింధూర్ అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని మోదీ తేల్చిచెప్పినట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అలాగే, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ భేటీ కావడానికి ముందు ఇద్దరి మధ్య ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ కుదర్చినట్టు ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయం ఎంతమాత్రమూ లేదని సూటిగా చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికమని, ఇందులో మూడో దేశ ప్రమేయం ఎంతమాత్రం లేదని ట్రంప్కు వివరించారు. పాకిస్థాన్ పదేపదే అభ్యర్థించడం వల్లే తాము ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేయాల్సి వచ్చిందని కూడా ప్రధాని మోదీ ట్రంప్కు తెలియజేశారు. ఈ విషయంలో అమెరికా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, అలాంటి ప్రమేయానికి ఆస్కారమే లేదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.
Also Read : కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు
ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం ఉందంటూ వస్తున్న విమర్శలకు తెరపడినట్టయింది.
ఇటలీ, ఇండియా దోస్త్ మేరా దోస్త్.. మోదీ ఫొటోతో మెలోనీ పోస్ట్ వైరల్
మరోవైపు జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్తో జరిపే చర్చల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని.. అలా జరగాలని తాము కోరుకోవడం లేదని భారత్ కుండ బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్కు జమ్మూ కశ్మీర్ అంశంపై ఫోన్ ద్వారా ప్రధాని మోదీ స్పష్టం చేశారని ఆయన వివరించారు.
Also read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?