/rtv/media/media_files/2025/06/07/QUex0VwqQKtSYBQ9YyMk.jpg)
Wife's sketch to kill husband
AP Crime : పూర్వకాలంలోలా భర్త చెప్పినట్లు నడుచుకోవడానికి భార్యలు సిద్ధపడటం లేదు. వారికి సొంత ఇమెజ్ కావాలని కోరుకుంటున్నారు. నలుగురిలో తమకంటూ గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. ఇంతకు ముందులా తిడితే పడడానికి, కొడితే సర్ధకుపోవడానికి సిద్ధంగా లేరు. అంతేకాదు అవసరమైతే భర్తను వదిలించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. అలాంటిదే మచిలీపట్నంలోనూ చోటు చేసుకుంది.
Also Read : తప్పు చేశావ్ కోహ్లీ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
మచిలీపట్నం కాలేఖాన్ పేటకు చెందిన ప్రసాద్, ఉషారాణి దంపతులు ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. ఉన్నంతలో ఆనందంగానే ఉన్నారు. అయితే రాత్రి వరకు అందరితో గడిపిన ప్రసాద్.. తెల్లారే సరికి రక్తం మడుగులో పడివున్నాడు. ఉషారాణి, ఆమె పిల్లలు కంటికి ధారగా విలపిస్తు్న్నారు. తీవ్రగాయలపాలైన ప్రసాద్ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతను అపాస్మారక స్థితికి చేరుకోవడంతో ఏం జరిగిందని భార్య పిల్లలను అడిగారు.
Also Read : బాలయ్య మంచి మనసు! అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన వీడియో వైరల్
అడిగిందే తడవు ఉషారాణి దృశ్యం చిత్రం లాంటి ఓ క్రైమ్ కథను అల్లి చెప్పింది. కొడుకు, బిడ్డ కూడా అదే కథను అచ్చుగుద్దినట్లు వినిపించారు. నలుగురైదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చారని, ప్రసాద్ను చితకబాదారని, ఆ తర్వాత బావిలో పడేసి వెళ్లిపోయారని ఎక్కడ కూడా స్క్రీప్ట్ మిస్ కాకుండా అందంగా వినిపించారు. అంతేకాదు అడ్డుకోబోయిన తనను తన పిల్లలను కూడా కొట్టారని చెప్పింది. విన్నవారంతా అయ్యోపాపం ఎంత దారుణం. వాళ్ల చేతులు పడిపోను అంటూ తిట్టుకున్నారు. ఇంకా నయం మీరు అడ్డుపడ్డారు కాబట్టీ సరిపోయింది..లేదంటే ఆ దుర్మార్గులు ప్రసాద్ను చంపేసి ఉండేవాళ్లని జాలి పడ్డారు. భర్తను కాపాడుకున్న గొప్ప భార్య అని కితాబు ఇచ్చారు. అమ్మయ్య మన కథ వర్కవుట్ అయిందని, అందరూ నమ్మేశారు కనుక ఇక ఏం కాదని, ప్రసాద్ ఎలాగు బతకడు కనుక తమకు వచ్చిన సమస్య ఏం లేదని తమను తాము సర్ధిచెప్పుకుని సంతోష పడ్డారు, విషయం పోలీసులకు చేరింది. వారికి అదే కథ సీన్ టు సీన్ వివరించారు. వారూ నమ్మారు. కానీ ఎక్కడో అనుమానం వారింటి చుట్టూ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించారు. కానీ, ప్రసాద్ ఇంటికి ఎవరు అనుమానితులు వచ్చినట్లు కనిపించలేదు. మళ్లీ మళ్లీ అడిగిన అదే కథ వినిపించారు.వాళ్లు చెప్పింది నిజమేనని నమ్మినా టెక్నికల్గా ఎలాంటి ఆధారాల్లేవు. పోనీ ప్రసాద్కు ఎవరైనా శత్రువులు వున్నారా ఆని ఆరా తీస్తే అలాంటివేం లేదని తెలిసింది. ప్రసాద్తో ఎవరికి ఎలాంటి శతృత్వం లేదని తెలిసింది. ఈ కేసు ఖాకీలకు ఓ సవాల్గా మారింది.
Also Read : భారత్లో ఎలన్ మస్క్ స్టార్లింక్ సేవలకు పచ్చజెండా
ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. రేపో మాపో చస్తాడనుకున్న ప్రసాద్ కోలుకున్నాడు. అసలు కథ ఆయన చెప్పడంతో భార్య పిల్లల కథ ఉత్తదే అని తేలింది. అసలేం జరిగింది ఆరాతీస్తే...తన భార్య, కొడుకు, బిడ్డ ముగ్గురు కలిసి తనను చంపాలని చూశారని చెప్పడంతో అందరూ అవక్కాయ్యారు. అదేంటి భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కదా అని అడిగితే.. బయటకు ఎలా ఉన్నా ప్రసాద్ …ఎప్పుడూ భార్యను తిడుతూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకు సైతం సూటిపోటీ మాటలనేవాడని తెలిసింది. దీంతో ఉషారాణి బాధపడేది. తన బాధను బిటెక్ చదువుతున్న కొడుకు, హైస్కూల్ చదువుతున్న కూతురుకు చెప్పుకుని ఏడ్చింది. తల్లి కన్నీళ్లు చూసి బిడ్డలు కుమిలిపోయారు. అమ్మను తిడతాడా అని తండ్రి మీద కోపం పెంచుకున్నారు. ముగ్గురు కలిసి ప్రసాద్ను చంపేయాలని ప్లాన్ చేశారు.
Also Read : దీపికకు నేనంటే చాలా ఇష్టం.. నాతో రెండేళ్లు తిరిగింది: మాజీ ప్రియుడు సంచలనం!
ఓ రోజు ప్రసాద్ గాఢనిద్రలో ఉన్న టైమ్లో ముగ్గరు కలిసి ప్రసాద్ కళ్లు చేతులు కట్టేసి చితకబాదారు. అతను అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో చనిపోయాడని భావించారు. అలాగే తీసుకెళ్లి బావిలో పడేశారు. అయితే నీళ్లల్లో పడగానే ప్రసాద్కు మెలకువ వచ్చింది. తనను కాపాడమని వేడుకున్నాడు. చుట్టు పక్కల వారు వింటే మొదటికే మోసం వస్తుందని భావించిన వారు బావిలోనే చావాలని రాళ్లు విసిరారు. రాళ్ల దెబ్బలకు మరింత అరిచాడు. ఆయన అరుపులు అందరికీ వినవస్తాయని వెంటనే బావిలోకి నిచ్చెన వేశారు.ప్రసాద్ పైకి రాగానే అతనిపై మళ్లీ దాడి చేశారు. వారు కొట్టిన దెబ్బలకు ప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మళ్లీ చచ్చాడు అనుకున్నారు. ఏడుపు మొదలు పెట్టారు. చుట్టు పక్కల వారు వస్తే దుండగులు దాడిచేసి కొట్టి బావిలో పడేశారని కథ చెప్పారు. అందరూ నిజమేననుకున్నారు. కానీ కొన ఊపిరితో వున్నాడని గమనించిన స్థానికులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. చస్తాడనుకున్న ప్రసాద్ తిరిగి బతకడమే కాకుండా అసలు కథ వినిపించడంతో ఉషారాణి సహా కుమారుడిని అరెస్ట్ చేసి కటకటాలబాటపట్టించారు పోలీసులు. అసలు కథ విన్న జనాలు అమ్మో తల్లి బిడ్డలు మాకు కొంత సినిమా చూపించారు కదరా నాయన అనుకున్నారు.
Also Read : బాలయ్య మంచి మనసు! అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన వీడియో వైరల్
Also Read : కేటీఆర్కు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే?