Supreme Court: కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే?

బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.

New Update
 KTR

KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25వేల కోట్లు అవినీతికి పాల్పడిందని కేటీఆర్ గతంలో ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు  చేశారు. ఈ కేసుని హైకోర్టుపై సవాల్ చేశారు కేటీఆర్.. హైకోర్టు కేటీఆర్ కు అనుకూలంగా తీర్పుచెప్పింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. శుక్రవారం ఆత్రం సుగుణ పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.  పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read :  180 మీటర్లకే ఓలా బైక్ బుకింగ్.. రైడర్‌కు దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన యువతి

Also Read :  వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

Also Read :  ఆ కామాంధుడు ట్రంప్‌‌పై 34 కేసులు.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఇదే!!

Also Read :  ముగిసిన ఈటల రాజేందర్ విచారణ... ఆయన ఏం చెప్పారంటే...

brs | ktr | telangana | Supreme Court | police-noties | congress-government | latest-telugu-news | supreme court big shock

Advertisment
Advertisment
తాజా కథనాలు