/rtv/media/media_files/2025/06/07/uMA6QaeotsXYI3OtO5el.jpg)
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత మూడు రోజులుగా మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. కార్యకర్తల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ మృతదేహాలు ఉన్నాయి.
Also Read : దురదృష్టం.. ‘ఎయిర్పోర్ట్లో వాష్రూమ్కు వెళ్లి.. రూ.2.65 లక్షల నష్టపోయాడు’
Encounter in Chhattisgarh Bijapur
#BREAKING Seven Naxalites, including Central Committee member Sudhakar and Telangana State Committee member Bhaskar, were killed in three separate encounters in Bijapur, Chhattisgarh. The identities of two female and three male Naxalites remain unknown. pic.twitter.com/YBHrvcivgJ
— IANS (@ians_india) June 7, 2025
Also Read : కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శి దారుణ హత్య.. మృతదేహం చెరువులో లభ్యం
బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో జూన్ 5, 6, 7 తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్ల ఏడుగురు మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 5 జూన్ న కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం, 6 జూన్ న తెలంగాణ రాష్ట్ర కమిటీ (TSC) సభ్యుడు భాస్కర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 6, 7 మధ్య సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లలో మరో మూడు మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి రెండు AK-47 రైఫిల్స్తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : తెలంగాణలో ఉరుములు మెరుపులతో దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాల్లో దారుణం!
Also Read : జ్యోతి మల్హోత్ర కేసులో బిగ్ ట్విస్ట్.. ఇండియాలో పాక్ గూఢచారులను నియమించింది ఇతనే
maoists | bijapur-encounter-case | latest-telugu-news | bijapur encounter | today-news-in-telugu | breaking news in telugu