Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

New Update
rains

rains Photograph: (rains)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు సాయంత్రానికి  కోల్‌కతా సమీపంలోని హైదా దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణకి భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

ఇది కూడా చూడండి: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

తెలంగాణలో ఈ జిల్లాల్లో..

ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తాయని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, కోమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!

ఇది కూడా చూడండి: Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

ఇక ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

Andhra Pradesh | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు