Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాక్ చీఫ్ అసిమ్ మునీర్, పర్యవేక్షించింది ISI చీఫ్ అని ఆ దేశ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఆదిల్ రాజా అన్నారు. ప్రజల్లో అసిమ్ మునీర్ పట్ల ఉన్న అసమ్మతిని మళ్లించడానికే అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్‌ చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

పహల్గామ్ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్ మాజీ సైన్యాధికారి సంచలన విషయాలు బయటపెట్టారు. పాక్ ప్రజలకు తనపై ఉన్న అసమ్మతిని మళ్లించడానికి ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్‌కు కుట్ర చేశారని అన్నారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని బైసరన్ లోయలో టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు. ఆ దాడికి సూత్రదారి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, దాన్ని పర్యవేక్షించింది ఐఎస్ఐ చీఫ్ అని పాక్ ఆర్మీ మాజీ మేజర్ ఆదిల్ రాజా తెలిపారు. 

Also Read :  టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు

Pakistani Army

Also Read :  Jubilee Hills Pub: జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

ఇందులో పాక్ ఆర్మీలో పని చేస్తున్న ఐదుగురు ఉన్నతాధికారుల ప్రమేయాన్ని కూడా కలిగి ఉందన్నారు. పహల్గామ్‌ టెర్రర్ అటాక్‌కు కారణమైన ఆ అధికారుల పేర్లు, ఫేస్‌లు, వివరాలు ఇప్పుడు బయటకొచ్చాయని మేజర్ ఆదిల్ రాజా అన్నారు. 

పాకిస్తాన్ సైన్యం టెర్రరిస్టులకు ఎలా సపోర్ట్ చేస్తోందో, జమ్మూ కాశ్మీర్‌లో హింసను రెచ్చగొట్టడానికి చొరబాట్ల కోసం ఎలా పనిచేస్తుందో రాజా ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉగ్రదాడిలో తమ సైన్యం ప్రమేయం ఉందని, అందులో అసిమ్ మునీర్ ప్రత్యక్ష పాత్ర పోషించాడని మేజర్ ఆదిల్ రాజా కామెంట్స్‌లో క్లారిటీగా అర్థమవుతున్నాయి.

Also Read :  సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా

Also Read :  ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

pakistan-army | pahalgam terror attack | Pahalgam terror attack 2025 | jammu-kashmir | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు