Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

హరీష్‌రావు కేటీఆర్‌ కింద పనిచేయడంతో గొప్ప ఏముందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కొప్పుల ఈశ్వర్‌, రసమయి కింద పనిచేస్తే అది గొప్ప అన్నారు. వారి ఇంట్లో ఎవరి కింద ఎవరూ పనిచేసినా ఒకటే కదా అన్నారు. కేటీఆర్‌, హరీష్‌రావులు బిల్లా రంగాలని ఏద్దేవా చేశారు.

New Update
 Harish Rao vs Revanth Reddy

Harish Rao vs Revanth Reddy

Revanth Reddy : బీఆర్‌ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. క్రమశిక్షణ కలిగిన కేసీఆర్‌ కార్యకర్తను నేను.. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా.. అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిపై సీఎం రేవంత్‌ గాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read :  నీ భూమి కబ్జా చేస్తే ఆ బాధ తెలుస్తుంది.. CI పై రంగనాథ్ ఫైర్!

హరీష్‌రావు కేటీఆర్‌ కింద పనిచేయడంతో గొప్ప ఏముందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కొప్పుల ఈశ్వర్‌, రసమయి కింద పనిచేస్తే అది గొప్ప అన్నారు. వారి ఇంట్లో ఎవరి కింద ఎవరూ పనిచేసినా ఒకటే కదా అన్నారు. కేటీఆర్‌, హరీష్‌రావులు బిల్లా రంగాలని ఏద్దేవా చేశారు. బిల్లా రంగా కింద చేసినా, రంగా బిల్లా కింద చేసినా పెద్ద తేడా ఏముందని ప్రశ్నించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పగ్గాలు దళితునికి ఇవ్వాలన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌ కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించిన ఆయన దాన్ని దళితునికి ఇవ్వాలని సూచించారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన 244 మంది ఏఈలకు, 199 మంది జేటీవోలకు జలసౌధలో నియామక పత్రాలు అందజేసిన సందర్భంలో ఆయన మాట్లాడారు.

Also Read :  బయటపడ్డ టర్కీ మరో కుట్ర.. పాక్‌తో కలిసి ఏం చేసిందంటే?


‘తెలంగాణ ఉద్యమం అనే భావోద్వేగాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం వాడుకున్నారని సీఎం రేవంత్‌ అన్నారు. రాష్ట్రంలో నీళ్లు పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావోద్వేగాన్ని కొంత మంది రాజకీయాలకు వాడుకొని  రాజకీయ లబ్ధిపొందారన్నారు.జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు. భాక్రానంగల్, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీలకు నెహ్రూ పునాది వేశారు. ఆ ప్రాజెక్టులు వందేళ్లైనా చెక్కు చెదరలేదు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను చూసి ప్రాజెక్టులు ఎలా నిర్మించాలో తెలుసుకోవాలని, కాళేశ్వరం చూసి ఎలా కట్టకూడదో నేర్చుకోవాలని సీఎం ఉద్బోధించారు.

Also Read :  హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!
   

Advertisment
Advertisment
తాజా కథనాలు