Pakistan: పాకిస్తాన్ లో భూకంపం..భారత్ సరిహద్దుల్లో కూడా..
నిన్న రాత్రి పాకిస్తాన్ లో భూకంప సంభవించింది. ఇస్లామాబాద్లలో శనివారం రాత్రి 10:48 గంటలకు భూకంప ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం భారత సరిహద్దు అయిన పీవోకే మీద కూడా పడింది.
నిన్న రాత్రి పాకిస్తాన్ లో భూకంప సంభవించింది. ఇస్లామాబాద్లలో శనివారం రాత్రి 10:48 గంటలకు భూకంప ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం భారత సరిహద్దు అయిన పీవోకే మీద కూడా పడింది.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట 18 మంది ప్రాణాలు బలిగొంది. ఇందులో 11 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రయాగ్ రాజ్ వెళ్ళాల్సిన రైళ్లు రద్దయ్యాయనే పుకారు చెలరేగడమే తొక్కిసలాటకు కారణం అని అంటున్నారు.
అమెరికా నుంచి అక్రమ వలసదారులతో వచ్చిన రెండో విమానం నిన్న రాత్రి అమృత్ సర్ చేరుకుంది. రెండో విడతలో మొత్తం 116 మంది భారత్ కు చేరుకున్నారు. వీరిని రిసీవ్ చేరుకోవడానికి బంధువులు విమానాశ్రయానికి ముందుగానే చేరుకున్నారు.
అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా కు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. తన తల్లిదండ్రులను సైతం చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని రణవీర్ కోరుతున్నాడు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు.
తలసేమియా బాధితుల కోసం విజయవాడలో ఈరోజు ఎన్టీయార్ ట్రస్ట్ యుఫోరియాతో తమన్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది. దీనికి సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలకృష్ణలు హాజరయ్యారు. ఎన్టీయార్ ట్రస్ట్, బసవతారకం ఆసుపత్రులు చేస్తున్న సేవని కొనియాడారు.
భారత జట్టుకు తరువాతి కెప్టెన్ స్పీడ్ గన్ బుమ్రా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ దీని మీద ఒక నిర్ణయానికి వచ్చిందని...ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ను కూడా ఒప్పిందని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత బుమ్రానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు.
ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడం మరింత ఆలస్యం కానుంది. తనను బారత్ కు అప్పగించడంపై రాణా మళ్ళా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీని తీర్పు వచ్చేవరకు అతని అప్పగింత సాధ్యం కాదు.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. 13, 14 ప్లాట్ ఫామ్ లపై రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది.